జెబెల్ జైస్ పర్వతం నుండి జారి, భారతీయ ప్రవాసుడు మృతి..!!
- December 06, 2024
యూఏఈ: కేరళకు చెందిన 32 ఏళ్ల భారతీయ ప్రవాసుడు రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్ పర్వతం నుండి జారి మరణించాడు. జాతీయ దినోత్సవ సెలవుల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి క్యాంపింగ్కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. "వీరు సోమవారం రాత్రి పర్వతానికి చేరుకున్నారు. అక్కడ క్యాంపింగ్ వేశారు." అని ఇంకాస్ అధ్యక్షుడు, వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ప్రతినిధి నాసర్ అల్ మహా అన్నారు. "ఈ విషాదకరమైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సంఘటన జరగడంతో, అతని స్నేహితులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. మరణాన్ని అధికారులు ధృవీకరించారు. అతని మృతదేహాన్ని రస్ అల్ ఖైమాలోని సకర్ ఆసుపత్రికి తరలించారు." అని పేర్కొన్నారు. సందర్శకులు జెబెల్ జైస్ వంటి పర్వత ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా కొండ అంచుల దగ్గర ఫోటోలు దిగడం వంటి ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. మృతదేహాన్ని అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత కేరళకు తరలించినట్లు తెలిపారు. ఆయన అంత్యక్రియలు త్వరలో జరగనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







