Dh1.5 మిలియన్ గోల్డ్ బహుమతులను గెలుచుకోండిలా..!!
- December 11, 2024
దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 30వ ఎడిషన్లో భాగంగా దుబాయ్ జువెలరీ గ్రూప్ (డిజెజి) 1.5 మిలియన్ దిర్హామ్ల బంగారు బహుమతులను ప్రకటించింది. జనవరి 12, 2025 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) సమయంలో అవుట్లెట్లలో ఆభరణాల కోసం Dh1,500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు తమ వంతుగా 1.5 మిలియన్ దిర్హామ్ల బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతి వారం, రాఫిల్ డ్రాలలో 1 కిలోల బంగారం బహుమతిగా అందజేస్తారు. 20 మంది విజేతలు ఒక్కొక్కరికి 1/4 కిలోలు ఇవ్వనున్నారు. వీక్లీ డ్రాలు డిసెంబర్ 13, 20, 27, జనవరి 3, 12 తేదీలలో షెడ్యూల్ ఉంటాయి.
వీటితోపాటు ఎంపిక చేసిన వజ్రాలు, ముత్యాల ఆభరణాలపై 50 శాతం వరకు తగ్గింపు, ఎంపిక చేసిన బంగారు అభరణాలపై 1-5 శాతం మధ్య మేకింగ్ ఛార్జీల తగ్గింపు, పాత బంగారం ఎక్స్ఛేంజీలపై సున్నా వెయిటేజీ, ఎంపిక చేసిన కొనుగోళ్లతో ప్రత్యేక బహుమతులు అందుకోవచ్చు. 85కి పైగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లు, 275 రిటైల్ జ్యువెలరీ అవుట్లెట్లు ప్రమోషన్లో భాగం అవుతున్నాయని దుబాయ్ జువెలరీ గ్రూప్లోని బోర్డ్ మెంబర్ & మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ లైలా సుహైల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







