Dh1.5 మిలియన్ గోల్డ్ బహుమతులను గెలుచుకోండిలా..!!
- December 11, 2024
దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 30వ ఎడిషన్లో భాగంగా దుబాయ్ జువెలరీ గ్రూప్ (డిజెజి) 1.5 మిలియన్ దిర్హామ్ల బంగారు బహుమతులను ప్రకటించింది. జనవరి 12, 2025 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) సమయంలో అవుట్లెట్లలో ఆభరణాల కోసం Dh1,500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు తమ వంతుగా 1.5 మిలియన్ దిర్హామ్ల బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతి వారం, రాఫిల్ డ్రాలలో 1 కిలోల బంగారం బహుమతిగా అందజేస్తారు. 20 మంది విజేతలు ఒక్కొక్కరికి 1/4 కిలోలు ఇవ్వనున్నారు. వీక్లీ డ్రాలు డిసెంబర్ 13, 20, 27, జనవరి 3, 12 తేదీలలో షెడ్యూల్ ఉంటాయి.
వీటితోపాటు ఎంపిక చేసిన వజ్రాలు, ముత్యాల ఆభరణాలపై 50 శాతం వరకు తగ్గింపు, ఎంపిక చేసిన బంగారు అభరణాలపై 1-5 శాతం మధ్య మేకింగ్ ఛార్జీల తగ్గింపు, పాత బంగారం ఎక్స్ఛేంజీలపై సున్నా వెయిటేజీ, ఎంపిక చేసిన కొనుగోళ్లతో ప్రత్యేక బహుమతులు అందుకోవచ్చు. 85కి పైగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లు, 275 రిటైల్ జ్యువెలరీ అవుట్లెట్లు ప్రమోషన్లో భాగం అవుతున్నాయని దుబాయ్ జువెలరీ గ్రూప్లోని బోర్డ్ మెంబర్ & మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ లైలా సుహైల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









