యూఏఈ పౌరుల కోసం శుభవార్త తెలిపిన హంగరీ..!!

- December 13, 2024 , by Maagulf
యూఏఈ పౌరుల కోసం శుభవార్త తెలిపిన హంగరీ..!!

యూఏఈ: యూఏఈ సిటిజన్స్ ఇక నుండి(డిసెంబర్ 12నుండి) హంగేరిలోని అన్ని విమానాశ్రయాలలో ఇ-గేట్‌లను యాక్సెస్ చేయవచ్చని  విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్య రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నొక్కి చెబుతుందని, సహకారాన్ని పెంపొందించడంలో వారి పరస్పర నిబద్ధతను హైలైట్ చేస్తుందని తెలిపింది. ఇది యూఏఈ వాసులకు వేగవంతమైన, మరింత సమర్థవంతమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. అంతర్జాతీయ సమాజంలో యూఏఈ ఖ్యాతీని ఇది మరింత పెంచుతుందన్నారు.

పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. డిసెంబర్ 2024 నాటికి యూఏఈ పాస్‌పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది. యూఏఈ పాస్‌పోర్ట్ హోల్డర్ 180 దేశాలకు ప్రయాణించవచ్చు.  127 దేశాలు వీసా-రహిత ప్రయాణాన్ని అందిస్తాయి. 47 విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు eVisa లేదా వీసాను అందిస్తాయి. 18 దేశాలలో మాత్రమే పౌరులు ముందస్తు వీసా పొందాల్సి ఉంటుంది.  అలాగే ఆరు దేశాలకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) అవసరం అవుతుందని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com