యూఏఈ పౌరుల కోసం శుభవార్త తెలిపిన హంగరీ..!!
- December 13, 2024
యూఏఈ: యూఏఈ సిటిజన్స్ ఇక నుండి(డిసెంబర్ 12నుండి) హంగేరిలోని అన్ని విమానాశ్రయాలలో ఇ-గేట్లను యాక్సెస్ చేయవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్య రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నొక్కి చెబుతుందని, సహకారాన్ని పెంపొందించడంలో వారి పరస్పర నిబద్ధతను హైలైట్ చేస్తుందని తెలిపింది. ఇది యూఏఈ వాసులకు వేగవంతమైన, మరింత సమర్థవంతమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. అంతర్జాతీయ సమాజంలో యూఏఈ ఖ్యాతీని ఇది మరింత పెంచుతుందన్నారు.
పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. డిసెంబర్ 2024 నాటికి యూఏఈ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది. యూఏఈ పాస్పోర్ట్ హోల్డర్ 180 దేశాలకు ప్రయాణించవచ్చు. 127 దేశాలు వీసా-రహిత ప్రయాణాన్ని అందిస్తాయి. 47 విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు eVisa లేదా వీసాను అందిస్తాయి. 18 దేశాలలో మాత్రమే పౌరులు ముందస్తు వీసా పొందాల్సి ఉంటుంది. అలాగే ఆరు దేశాలకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) అవసరం అవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







