యూఏఈ పౌరుల కోసం శుభవార్త తెలిపిన హంగరీ..!!
- December 13, 2024
యూఏఈ: యూఏఈ సిటిజన్స్ ఇక నుండి(డిసెంబర్ 12నుండి) హంగేరిలోని అన్ని విమానాశ్రయాలలో ఇ-గేట్లను యాక్సెస్ చేయవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్య రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నొక్కి చెబుతుందని, సహకారాన్ని పెంపొందించడంలో వారి పరస్పర నిబద్ధతను హైలైట్ చేస్తుందని తెలిపింది. ఇది యూఏఈ వాసులకు వేగవంతమైన, మరింత సమర్థవంతమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. అంతర్జాతీయ సమాజంలో యూఏఈ ఖ్యాతీని ఇది మరింత పెంచుతుందన్నారు.
పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. డిసెంబర్ 2024 నాటికి యూఏఈ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది. యూఏఈ పాస్పోర్ట్ హోల్డర్ 180 దేశాలకు ప్రయాణించవచ్చు. 127 దేశాలు వీసా-రహిత ప్రయాణాన్ని అందిస్తాయి. 47 విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు eVisa లేదా వీసాను అందిస్తాయి. 18 దేశాలలో మాత్రమే పౌరులు ముందస్తు వీసా పొందాల్సి ఉంటుంది. అలాగే ఆరు దేశాలకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) అవసరం అవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









