గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్లో BD 26,000 జరిమానాలు..!!
- December 13, 2024
మనామా: ట్రావెల్ టికెట్ స్కామ్ లో నిందితులకు భారీ జరిమానా విధించారు. విదేశాలకు బంగారం తరలించిన నగల దుకాణం యజమాని, ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు మొత్తం BD 26,000 జరిమానా విధించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.
దుకాణ యజమానికి BD 10,000 జరిమానా విధించగా, అతని ఇద్దరు సహచరులకు కలిపి BD 15,000 జరిమానా విధించారు. నాల్గవ నిందితుడికి బిడి 1,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితులపై మనీలాండరింగ్, లైసెన్స్ లేని వ్యాపారం చేస్తున్నట్లు కేసులు నమోదు చేశారు. అనంతరం షాపులోని బంగారు నగలతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేషనల్ సెంటర్ (FINC) జరిపిన విచారణతో స్మగ్లింగ్ రాకెట్ బయటపడింది. దుకాణం యజమాని నకిలీ ఇన్వాయిస్ల ద్వారా బంగారు ఆభరణాలను విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







