గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్లో BD 26,000 జరిమానాలు..!!
- December 13, 2024
మనామా: ట్రావెల్ టికెట్ స్కామ్ లో నిందితులకు భారీ జరిమానా విధించారు. విదేశాలకు బంగారం తరలించిన నగల దుకాణం యజమాని, ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు మొత్తం BD 26,000 జరిమానా విధించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.
దుకాణ యజమానికి BD 10,000 జరిమానా విధించగా, అతని ఇద్దరు సహచరులకు కలిపి BD 15,000 జరిమానా విధించారు. నాల్గవ నిందితుడికి బిడి 1,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితులపై మనీలాండరింగ్, లైసెన్స్ లేని వ్యాపారం చేస్తున్నట్లు కేసులు నమోదు చేశారు. అనంతరం షాపులోని బంగారు నగలతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేషనల్ సెంటర్ (FINC) జరిపిన విచారణతో స్మగ్లింగ్ రాకెట్ బయటపడింది. దుకాణం యజమాని నకిలీ ఇన్వాయిస్ల ద్వారా బంగారు ఆభరణాలను విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









