తెలుగు రాష్ట్రాలు ‘గజగజ’
- December 15, 2024
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ప్రజలను గజగజ వణికిస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా నమోదవుతోంది. బేల ప్రాంతంలో 6.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం చలికి అద్దంపడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కుంతలంలో 8.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. చలి తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉండటంతో బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ప్రజలు గృహాల్లోనే తలదాచుకుంటున్నారు. పొలాల్లో పని చేసే రైతులు, నిర్మాణ కార్మికులు, ఇతర శ్రామిక వర్గాలు ఈ చలితో బాగా ఇబ్బంది పడుతున్నారు.
ఇక రాబోయే రోజుల్లో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో, తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని అంచనా. అయితే, రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చలి ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి హడావుడి సన్నగిల్లింది. ప్రజలు కాఫీ, టీ లాంటి తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెచ్చని బట్టలు, దుబ్బట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. రోడ్లపై తెల్లవారుజామున మంచు తరచుగా కనిపిస్తూ, వాహనదారులకు సమస్యలు కలిగిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









