సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాల పై వివరణ
- December 16, 2024
హైదరాబాద్: కొన్ని పత్రికల్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాలు మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటాయని తప్పుగా ప్రచురించడం జరిగింది.ఈ విషయం పై స్పష్టత ఇవ్వడం జరుగుతోంది.
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ 24 గంటలూ, 7 రోజులు పనిచేస్తుంది.అందువల్ల ఎవరైనా సైబర్ నేరాలను నివేదించవచ్చు లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవచ్చు.
కేసు స్థితి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ప్రత్యేకంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 4 గంటల నుండి 5 గంటల వరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు.తద్వారా అధికారులు కేసుల దర్యాప్తు కోసం మరింత సమయం కేటాయించగలరు.
సైబర్ నేరాలు లేదా అత్యవసర సహాయం అవసరమైన వారు ఎప్పుడైనా సంప్రదించవచ్చు.
హెల్ప్లైన్ నెంబర్: 1930– 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
సైబర్ క్రైమ్ వెబ్సైట్: http://www.cybercrime.gov.in–ఆన్లైన్ ఫిర్యాదుల కోసం.
సైబర్ క్రైమ్ స్టేషన్ నెంబర్: 94906 17310–సహాయం కోసం.
ప్రజలందరూ ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.సైబర్ నేరాల నియంత్రణలో మీ సహకారం అవసరం.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







