సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాల పై వివరణ
- December 16, 2024
హైదరాబాద్: కొన్ని పత్రికల్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాలు మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటాయని తప్పుగా ప్రచురించడం జరిగింది.ఈ విషయం పై స్పష్టత ఇవ్వడం జరుగుతోంది.
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ 24 గంటలూ, 7 రోజులు పనిచేస్తుంది.అందువల్ల ఎవరైనా సైబర్ నేరాలను నివేదించవచ్చు లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవచ్చు.
కేసు స్థితి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ప్రత్యేకంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 4 గంటల నుండి 5 గంటల వరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు.తద్వారా అధికారులు కేసుల దర్యాప్తు కోసం మరింత సమయం కేటాయించగలరు.
సైబర్ నేరాలు లేదా అత్యవసర సహాయం అవసరమైన వారు ఎప్పుడైనా సంప్రదించవచ్చు.
హెల్ప్లైన్ నెంబర్: 1930– 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
సైబర్ క్రైమ్ వెబ్సైట్: http://www.cybercrime.gov.in–ఆన్లైన్ ఫిర్యాదుల కోసం.
సైబర్ క్రైమ్ స్టేషన్ నెంబర్: 94906 17310–సహాయం కోసం.
ప్రజలందరూ ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.సైబర్ నేరాల నియంత్రణలో మీ సహకారం అవసరం.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







