సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాల పై వివరణ
- December 16, 2024
హైదరాబాద్: కొన్ని పత్రికల్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాలు మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటాయని తప్పుగా ప్రచురించడం జరిగింది.ఈ విషయం పై స్పష్టత ఇవ్వడం జరుగుతోంది.
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ 24 గంటలూ, 7 రోజులు పనిచేస్తుంది.అందువల్ల ఎవరైనా సైబర్ నేరాలను నివేదించవచ్చు లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవచ్చు.
కేసు స్థితి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ప్రత్యేకంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 4 గంటల నుండి 5 గంటల వరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు.తద్వారా అధికారులు కేసుల దర్యాప్తు కోసం మరింత సమయం కేటాయించగలరు.
సైబర్ నేరాలు లేదా అత్యవసర సహాయం అవసరమైన వారు ఎప్పుడైనా సంప్రదించవచ్చు.
హెల్ప్లైన్ నెంబర్: 1930– 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
సైబర్ క్రైమ్ వెబ్సైట్: http://www.cybercrime.gov.in–ఆన్లైన్ ఫిర్యాదుల కోసం.
సైబర్ క్రైమ్ స్టేషన్ నెంబర్: 94906 17310–సహాయం కోసం.
ప్రజలందరూ ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.సైబర్ నేరాల నియంత్రణలో మీ సహకారం అవసరం.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









