ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!
- December 16, 2024
న్యూ ఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం భారత్కు చేరుకున్నారు.ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దిసనాయకే తొలి విదేశ పర్యటన ఇదే. చర్చలకు ముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు.ప్రధాని మోదీ, అనుర దిసానాయక్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరించారు.
ఇరుదేశాల మధ్య ఒప్పందం
ఈ సందర్భంగా రెండు దేశాలమధ్య కొన్ని కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది.
వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా సహకారంపై ఒప్పందం జరిగినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్లో తొలిసారిగా పర్యటిస్తున్న దిసనాయకేను కలవడం ఆనందంగా ఉందన్నారు.
దేశాల ప్రయోజనాల కోసం..
నైబర్హుడ్ ఫస్ట్ విధానం, సాగర్ ఔట్లుక్కి శ్రీలంక కీలకమైందని.. ప్రధాని మోదీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోగా..కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో పాటు అధికారులు స్వాగతం పలికారని సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలో పిన్న వయసులో ప్రెసిడెంట్ గా ఎన్నికై, తొలిసారిగా మన దేశానికి వచ్చారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









