వీసా క్షమాభిక్ష స్కీమ్.. ఓవర్స్టేయర్లకు ఫైనల్ కాల్..!!
- December 17, 2024
యూఏఈ: వీసా క్షమాభిక్ష డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) అలెర్ట్ జారీ చేసింది. వీసా క్షమాభిక్ష ముగిసేలోపు ఉపయోగించుకోవాలని అక్రమంగా నివసిస్తున్న వారికి సూచించింది. సెప్టెంబరు 1న క్షమాభిక్ష పథకం ప్రారంభమైంది. ఓవర్స్టేయర్లు తమ స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలను ఎదుర్కోకుండా వారి స్వదేశాలకు తిరిగి రావడానికి మరింత సమయాన్ని అందించడానికి వీలుగా ఇప్పటికే ఒకసారి తుది గడువును పొడిగించారు. GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి ఓవర్స్టేయర్లకు చివరి అప్పీల్ చేశారు. “క్షమాభిక్ష ముగియబోతోంది, ఇంకా తమ హోదాను క్రమబద్ధీకరించని ఓవర్స్టేయర్లు వారి రెసిడెన్సీని సరిదిద్దడానికి గ్రేస్ పీరియడ్ మిగిలిన సమయాన్ని ఉపయోగించుకోవాలి." అని సూచించారు. వయోలేటర్స్ అండ్ ఫారినర్స్ ఫాలో-అప్ సెక్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సలాహ్ అల్ కమ్జీ మాట్లాడుతూ.. తుది గడువు అనంతరం తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









