వీసా క్షమాభిక్ష స్కీమ్.. ఓవర్స్టేయర్లకు ఫైనల్ కాల్..!!
- December 17, 2024
యూఏఈ: వీసా క్షమాభిక్ష డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) అలెర్ట్ జారీ చేసింది. వీసా క్షమాభిక్ష ముగిసేలోపు ఉపయోగించుకోవాలని అక్రమంగా నివసిస్తున్న వారికి సూచించింది. సెప్టెంబరు 1న క్షమాభిక్ష పథకం ప్రారంభమైంది. ఓవర్స్టేయర్లు తమ స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలను ఎదుర్కోకుండా వారి స్వదేశాలకు తిరిగి రావడానికి మరింత సమయాన్ని అందించడానికి వీలుగా ఇప్పటికే ఒకసారి తుది గడువును పొడిగించారు. GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి ఓవర్స్టేయర్లకు చివరి అప్పీల్ చేశారు. “క్షమాభిక్ష ముగియబోతోంది, ఇంకా తమ హోదాను క్రమబద్ధీకరించని ఓవర్స్టేయర్లు వారి రెసిడెన్సీని సరిదిద్దడానికి గ్రేస్ పీరియడ్ మిగిలిన సమయాన్ని ఉపయోగించుకోవాలి." అని సూచించారు. వయోలేటర్స్ అండ్ ఫారినర్స్ ఫాలో-అప్ సెక్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సలాహ్ అల్ కమ్జీ మాట్లాడుతూ.. తుది గడువు అనంతరం తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







