వీసా క్షమాభిక్ష స్కీమ్.. ఓవర్స్టేయర్లకు ఫైనల్ కాల్..!!
- December 17, 2024
యూఏఈ: వీసా క్షమాభిక్ష డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) అలెర్ట్ జారీ చేసింది. వీసా క్షమాభిక్ష ముగిసేలోపు ఉపయోగించుకోవాలని అక్రమంగా నివసిస్తున్న వారికి సూచించింది. సెప్టెంబరు 1న క్షమాభిక్ష పథకం ప్రారంభమైంది. ఓవర్స్టేయర్లు తమ స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలను ఎదుర్కోకుండా వారి స్వదేశాలకు తిరిగి రావడానికి మరింత సమయాన్ని అందించడానికి వీలుగా ఇప్పటికే ఒకసారి తుది గడువును పొడిగించారు. GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి ఓవర్స్టేయర్లకు చివరి అప్పీల్ చేశారు. “క్షమాభిక్ష ముగియబోతోంది, ఇంకా తమ హోదాను క్రమబద్ధీకరించని ఓవర్స్టేయర్లు వారి రెసిడెన్సీని సరిదిద్దడానికి గ్రేస్ పీరియడ్ మిగిలిన సమయాన్ని ఉపయోగించుకోవాలి." అని సూచించారు. వయోలేటర్స్ అండ్ ఫారినర్స్ ఫాలో-అప్ సెక్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సలాహ్ అల్ కమ్జీ మాట్లాడుతూ.. తుది గడువు అనంతరం తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు