ఆన్లైన్లో షాపింగ్ చేసే పర్యాటకుల కోసం VAT రీఫండ్..!!
- December 17, 2024
యూఏఈ: యూఏఈలోని పర్యాటకులు తమ దేశంలో ఉన్న సమయంలో చేసిన ఇ-కామర్స్ కొనుగోళ్లపై త్వరలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని తిరిగి పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త ఇ-కామర్స్ VAT రీఫండ్ సిస్టమ్ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA)తో రిజిస్టర్ చేయబడిన ప్లాట్ఫారమ్లు, ఇ-స్టోర్లు యూఏఈలో ఉన్నప్పుడు పర్యాటకులు వారి ఆన్లైన్ కొనుగోళ్లపై VAT రీఫండ్లను పొందవచ్చు. కొత్త పన్ను విధానం పర్యాటకుల కోసం కొనుగోలు నుండి రీఫండ్ వరకు ప్రక్రియను సులభతరం చేస్తుందన్నారు.
యూఏఈలోని పర్యాటకులు నేరుగా రిజిస్టర్డ్ ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా VAT వాపసు అభ్యర్థనలను సమర్పించవచ్చు. ట్రావెల్ డాక్యుమెంట్స్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. పర్యాటకుల గుర్తింపు ధృవీకరించబడిన తర్వాత, వారు దేశం విడిచి వెళ్లినప్పుడు రీఫండ్ ప్రక్రియ పూర్తవుతుంది. రెండేళ్ళ క్రితం ప్రారంభించిన డిజిటల్ ట్యాక్స్ రీఫండ్ సిస్టమ్ విజయవంతం కావడంతో కొత్త విధానాన్ని రూపొందించారు. ఇది వాపసు ప్రక్రియను వేగంగా చేస్తుందని అధికారులు తెలిపారు. కొత్త స్కీమ్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా యూఏఈ ఖ్యాతిని మరింత పెంచుతుందని FTA డైరెక్టర్ జనరల్ ఖలీద్ అలీ అల్ బుస్తానీ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







