తేనెటీగల ముసుగులో డ్రగ్స్ రవాణా.. ఐదుగురు సభ్యుల ముఠా గుట్టురట్టు..!!
- December 17, 2024
రియాద్: తేనెటీగల దిగుమతి వ్యాపారం ముసుగులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సౌదీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఒక సౌదీ పౌరుడు, నలుగురు ఈజిప్టు పౌరులు ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యాపారం కోసం తేనెటీగలను దిగుమతి చేసుకుంటూ మాదకద్రవ్యాలను ఈ ముఠా స్మగ్లింగ్ కు పాల్పడుతుందని పేర్కొన్నారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులపై అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. రాజ్యంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హ్యుమన్ ట్రాఫికింగ్ను ఎదుర్కోవడానికి తమ నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







