ఖోర్ ఫక్కన్‌లో విషాదం. బస్సు బోల్తా పడి 9 మంది మృతి..!!

- December 17, 2024 , by Maagulf
ఖోర్ ఫక్కన్‌లో విషాదం. బస్సు బోల్తా పడి 9 మంది మృతి..!!

యూఏఈ: ఖోర్ ఫక్కన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  ఆదివారం భవన నిర్మాణ కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. షార్జా పోలీసులు ప్రమాదాన్ని ధృవీకరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడిందని, 73 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించినట్టు తెలిపారు.  ఖోర్ ఫక్కన్ నగరం ఎంట్రీ పాయింట్ అయిన  వాడి విషీ స్క్వేర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన  వారికి ప్రథమ చికిత్స అందించి, వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్టు ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ అలీ అల్ హమౌడీ తెలిపారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com