ఖోర్ ఫక్కన్లో విషాదం. బస్సు బోల్తా పడి 9 మంది మృతి..!!
- December 17, 2024
యూఏఈ: ఖోర్ ఫక్కన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం భవన నిర్మాణ కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. షార్జా పోలీసులు ప్రమాదాన్ని ధృవీకరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడిందని, 73 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించినట్టు తెలిపారు. ఖోర్ ఫక్కన్ నగరం ఎంట్రీ పాయింట్ అయిన వాడి విషీ స్క్వేర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్టు ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అలీ అల్ హమౌడీ తెలిపారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







