ఖోర్ ఫక్కన్లో విషాదం. బస్సు బోల్తా పడి 9 మంది మృతి..!!
- December 17, 2024
యూఏఈ: ఖోర్ ఫక్కన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం భవన నిర్మాణ కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. షార్జా పోలీసులు ప్రమాదాన్ని ధృవీకరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడిందని, 73 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించినట్టు తెలిపారు. ఖోర్ ఫక్కన్ నగరం ఎంట్రీ పాయింట్ అయిన వాడి విషీ స్క్వేర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్టు ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అలీ అల్ హమౌడీ తెలిపారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









