డిసెంబర్ 21-22 తేదీల్లో కువైట్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
- December 18, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 21వ తేదీ( శనివారం) రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కువైట్లో పర్యటించనున్నారు. కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ హెచ్హెచ్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబా.. ప్రధాని మోదీతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి శ్రీ దీ కూడా తన పర్యటన సందర్భంగా కమ్యూనిటీ సంఘాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డిసెంబర్ 22 (ఆదివారం) నాడు కువైట్ ఉన్నతాధికారులతో ఆయన అధికారికంగా చర్చలు జరుపుతారు. కువైట్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు.దాదాపు 43 ఏళ్ల విరామం తర్వాత ప్రధాని స్థాయి వ్యక్తి కువైట్ లో పర్యటిస్తున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ పర్యటించని ఏకైక జిసిసి సభ్య దేశం కువైట్. 1981లో కువైట్ను సందర్శించిన చివరి భారత ప్రధాని ఇందిరా గాంధీ.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









