డిసెంబర్ 21-22 తేదీల్లో కువైట్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
- December 18, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 21వ తేదీ( శనివారం) రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కువైట్లో పర్యటించనున్నారు. కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ హెచ్హెచ్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబా.. ప్రధాని మోదీతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి శ్రీ దీ కూడా తన పర్యటన సందర్భంగా కమ్యూనిటీ సంఘాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డిసెంబర్ 22 (ఆదివారం) నాడు కువైట్ ఉన్నతాధికారులతో ఆయన అధికారికంగా చర్చలు జరుపుతారు. కువైట్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు.దాదాపు 43 ఏళ్ల విరామం తర్వాత ప్రధాని స్థాయి వ్యక్తి కువైట్ లో పర్యటిస్తున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ పర్యటించని ఏకైక జిసిసి సభ్య దేశం కువైట్. 1981లో కువైట్ను సందర్శించిన చివరి భారత ప్రధాని ఇందిరా గాంధీ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







