మాజీ భర్త నుంచి 1.5 బిలియన్ డాలర్లు డిమాండ్..మహిళకు జైలుశిక్ష..!!
- December 18, 2024
దుబాయ్: సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తను బెదిరించిన కేసులో జర్మనీకి చెందిన ఓ మహిళకు మూడు నెలల జైలు శిక్ష పడింది. తన మాజీ భర్తను 1.5 బిలియన్ డాలర్లు ఇవ్వాలని, లేదంటే హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్ట్ 48 ఏళ్ల మహిళను దోషిగా నిర్ధారించింది.
అయితే, 2023 డిసెంబర్ 6, 7 తేదీల్లో జరిగిన ఈ సంఘటన వారి పిల్లల సంరక్షణ, ఉమ్మడిగా యాజమాన్యంలోని వ్యాపారంపై కుటుంబ, ఆర్థిక వివాదాల కారణంగా ప్రేరేపించబడిందని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. రికార్డుల ప్రకారం, నిందితురాలు టెలిగ్రామ్, ఫేస్బుక్ ద్వారా అనేక బెదిరింపు సందేశాలను పంపినట్లు గుర్తించారు. బెదిరింపులు, డిమాండ్లతో పాటు, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రతను నియంత్రించే యూఏఈ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసారు.
అయితే, ఆమెకు ముందస్తు నేర చరిత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆమె తదుపరి నేరాలకు పాల్పడకూడదని షరతు విధించి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. నేరానికి ఉపయోగించిన ఆమె మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అప్పీల్ దాఖలు చేయగా, జనవరి 22న దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లో విచారణకు రానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







