మాజీ భర్త నుంచి 1.5 బిలియన్ డాలర్లు డిమాండ్..మహిళకు జైలుశిక్ష..!!
- December 18, 2024
దుబాయ్: సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తను బెదిరించిన కేసులో జర్మనీకి చెందిన ఓ మహిళకు మూడు నెలల జైలు శిక్ష పడింది. తన మాజీ భర్తను 1.5 బిలియన్ డాలర్లు ఇవ్వాలని, లేదంటే హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్ట్ 48 ఏళ్ల మహిళను దోషిగా నిర్ధారించింది.
అయితే, 2023 డిసెంబర్ 6, 7 తేదీల్లో జరిగిన ఈ సంఘటన వారి పిల్లల సంరక్షణ, ఉమ్మడిగా యాజమాన్యంలోని వ్యాపారంపై కుటుంబ, ఆర్థిక వివాదాల కారణంగా ప్రేరేపించబడిందని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. రికార్డుల ప్రకారం, నిందితురాలు టెలిగ్రామ్, ఫేస్బుక్ ద్వారా అనేక బెదిరింపు సందేశాలను పంపినట్లు గుర్తించారు. బెదిరింపులు, డిమాండ్లతో పాటు, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రతను నియంత్రించే యూఏఈ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసారు.
అయితే, ఆమెకు ముందస్తు నేర చరిత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆమె తదుపరి నేరాలకు పాల్పడకూడదని షరతు విధించి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. నేరానికి ఉపయోగించిన ఆమె మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అప్పీల్ దాఖలు చేయగా, జనవరి 22న దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లో విచారణకు రానుంది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









