ఫార్మాసిటీ వల్ల వేల ఉద్యోగాలు

- June 27, 2016 , by Maagulf
ఫార్మాసిటీ వల్ల వేల ఉద్యోగాలు

ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి జవదేకర్‌ను కోరామని, ఈ ప్రాజెక్ట్‌ ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఆయన కేంద్రమంత్రి జవదేకర్‌ను కలిశారు. ఆదిలాబాద్‌ జిల్లా జిన్నారం, నిర్మల్‌లో మైనింగ్‌ కోసం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎయిర్‌క్వాలిటీ తెలిపే డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటుకు సదుపాయాలు కల్పించాలని కోరామని ఆయన అన్నారు. హరితహారం కార్యక్రమానికి రావాలని జవదేకర్‌ను ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు బీబీపాటిల్‌, సీతారాం నాయక్‌లు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com