3 ప్రధాన సంస్థలతో ఒప్పందాలు- మంత్రి లోకేష్
- December 20, 2024
అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సంకల్పించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ప్రధానమైన 3 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. 2 కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, మరియు సెంచూరియన్ సంస్థలతో సీడాప్ అవగాహన ఒప్పందాలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరిగిపోతాయని ఆయన అన్నారు.
ఈ ఒప్పందాలు ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్, స్వయం ఉపాధి ప్రోత్సాహం మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆదాయవృద్ధి సాధ్యమవ్వడమే కాదు యువతకు ఉన్నతమైన ఆర్థిక స్థితి సాధించే అవకాశాలు ఈ ఒప్పందాల ద్వారా అందుతాయి. అదనపు ఆదాయం కల్పించడంపై కూడా ఫోకస్ పెట్టిన ప్రభుత్వం, ముఖ్యంగా నిరుద్యోగిత స్ధితిలో ఉన్న యువతకు స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నిధులు అందించటం, ఉపాధి సాధన చేయటం ద్వారా సామాజిక న్యాయం కూడా అందించబడుతుంది.
ఈ ఒప్పందాలు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల భవిష్యత్తును మెరుగుపర్చడం, వారి ఆర్థిక స్థితిని పెంచడం, మరియు సామాజికంగా సమన్వయంతో అభివృద్ధిని కలిగించే దిశగా దోహదపడతాయి.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









