షిర్డీ సాయి ఆలయం ఆ వేళ మూసివేత
- December 20, 2024
షిర్డీ: షిర్డీ సాయి ఆలయం ట్రస్టు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు దశాబ్దాలకు పైగా షిర్డీ ఆలయం కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. కాగా, ఆలయంలో సాయినాథుని విగ్రహాన్ని త్రీడీ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ రోజు (శుక్రవారం) ఆలయం మూడు గంటలు మూసి వేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ లో ఖచ్చితమైన ప్రతిరూపాన్ని తీర్చి దిద్దే ఆలోచనలో ఆలయ ట్రస్టు బోర్డు కసరత్తు చేస్తోంది.
సాయినాధుని విగ్రహం పరిశీలన
షిర్డీ ఆలయంలోని సాయి బాబా విగ్రహానికి అధికారులు 3డీ స్కానింగ్ చేయిస్తున్నారు. 70ఏళ్ల క్రితం ఇటాలియన్ మార్బుల్తో తయారు చేసిన ఈ విగ్రహం ప్రస్తుత పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడు దశాబ్దాల క్రితం షిర్డీలో సాయిబాబా పాలరాతి విగ్రహం ఏర్పాటు చేసారు. భవిష్యత్ లో ఖచ్చితమైన ప్రతిరూపాన్ని సిద్దం చేయటంతో పాటుగా ప్రస్తుత విగ్రహం పరిస్థితిని అంచనా వేసేందుకు 3డీ స్కానింగ్ చేస్తున్నారు. సాయిబాబా విగ్రహాని కి పాలు, నీళ్లతో నిరంతరం అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.
త్రీ డీ స్కాన్ ద్వారా గుర్తింపు
ఈ కారణంగా విగ్రహం క్రమం దెబ్బ తిన్నట్లుగా సంస్థాన్ అధికారులు గుర్తించారు. సాయిబాబా విగ్రహం మొత్తం పాలరాయిలో ఉంటుంది. అయితే, పాలరాయి సహజంగానే చల్లగా ఉండే స్వభావం కావటంతో వేడి నీరు, పాలు, పెరుగు వల్ల విగ్రహం దెబ్బతింటుందని సాయిబాబా సంస్థాన్ ఆలయ అధికారులకు నిపుణులు వివరించారు. విగ్రహం దెబ్బ తినకుండా పాలక వర్గానికి పలు సూచనలు చేసారు. ఆ విధంగానే జాగ్రత్తలు పాటిస్తున్నా.. విగ్రహం దెబ్బ తిన్నట్లు గుర్తించి, కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
మూడు గంటలు ఆలయం మూసివేత
అందులో భాగంగానే షిర్డీలోని సాయిబాబా విగ్రహానికి సంబంధించిన డేటాను త్రీడీ స్కానింగ్ ద్వారా భద్రపరచాలని నిర్ణయించారు. ఈ డేటా ఆధారంగా మళ్లీ అసలైన విగ్రహం ఏర్పాటుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఇందు కోసం ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు మ్యూజియం నిపుణులు డిసెంబరు 20న సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని త్రిడీ స్కానింగ్ చేయనున్నారు. దీని కారణంగా ఈ రోజు (డిసెంబరు 20) మధ్యాహ్నం 1.45 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు సాయి సంస్థాన్ తెలిపింది. ఆ సమయంలో సాయి దర్శనం కోసం భక్తులను అనుమతించమని వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









