కీలక రంగాల్లో ఎంఓయూల పై ఇండియా-కువైట్ సంతకాలు..!!

- December 23, 2024 , by Maagulf
కీలక రంగాల్లో ఎంఓయూల పై ఇండియా-కువైట్ సంతకాలు..!!

కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి కువైట్ పర్యటన సందర్భంగా రక్షణ సహకారం, సంస్కృతి, క్రీడల సహకారంలో ఇండియా- కువైట్ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకాలు చేశాయి. బయాన్ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రతినిధి స్థాయి చర్చల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడంపై దృష్టి సారించారు. రక్షణపై అవగాహన ఒప్పందం రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందుతుంది. ముఖ్య రంగాలలో శిక్షణ, సిబ్బంది, నిపుణుల మార్పిడి, ఉమ్మడి ఎక్సర్ సైజులు, రక్షణ పరిశ్రమలో సహకారం, రక్షణ పరికరాల సరఫరా, పరిశోధన మరియు అభివృద్ధిలో సహకారం మొదలైనవి ఉన్నాయి. ఎమ్ఒయులో భాగంగా కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కళ, సంగీతం, నృత్యం, సాహిత్యం, థియేటర్లలో గొప్ప సాంస్కృతిక మార్పిడి, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో సహకారం, సంస్కృతి , పండుగల నిర్వహణలో పరిశోధన అభివృద్ధిని సులభతరం చేయనుంది.

ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం ఇన్ స్పోర్ట్స్ సహకారంతో ఇండియా-కువైట్ మధ్య క్రీడా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఈ భాగస్వామ్యం కోసం క్రీడా నాయకుల సందర్శనల మార్పిడి, క్రీడా రంగంలో కార్యక్రమాలు, ప్రాజెక్టులలో పాల్గొనడం, స్పోర్ట్స్ మెడిసిన్, క్రీడలలో నైపుణ్యం మార్పిడి,  నిర్వహణ, స్పోర్ట్స్ మీడియా, స్పోర్ట్స్ సైన్స్ తదితర అంశాలపై సహకారం అందించనున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA)లో కువైట్ కూడా చేరింది. ISA సమిష్టిగా సౌర శక్తి విస్తరణను కవర్ చేస్తుంది. సభ్య దేశాలు తక్కువ-కార్బన్ వృద్ధి పథాలను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి సౌరశక్తి వినియోగాన్ని స్కేలింగ్ చేయడంలో కీలకమైన సాధారణ సవాళ్లకు పరిష్కారం అందిస్తుంది.

ప్రధాని మోదీ,  కువైట్ ప్రధాని మధ్య జరిగిన చర్చల సందర్భంగా రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, ఆరోగ్యం, విద్య, సాంకేతికత, సాంస్కృతిక వినిమయ రంగాలతో సహా అనేక రంగాలకు సంబంధించి అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com