తిరుపతి: స్థానికులకు జనవరి 5 నుంచి దర్శన టోకెన్లు!
- December 23, 2024
తిరుపతి: వచ్చే ఏడాది జనవరి ఐద నుంచి తిరుపతి స్థానికులకు దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం తిరుపతి స్థానికులు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు టోకెన్లు పొందేందుకు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







