తిరుపతి: స్థానికులకు జనవరి 5 నుంచి దర్శన టోకెన్లు!
- December 23, 2024
తిరుపతి: వచ్చే ఏడాది జనవరి ఐద నుంచి తిరుపతి స్థానికులకు దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం తిరుపతి స్థానికులు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు టోకెన్లు పొందేందుకు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









