తిరుపతి: స్థానికులకు జనవరి 5 నుంచి దర్శన టోకెన్లు!
- December 23, 2024
తిరుపతి: వచ్చే ఏడాది జనవరి ఐద నుంచి తిరుపతి స్థానికులకు దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం తిరుపతి స్థానికులు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు టోకెన్లు పొందేందుకు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







