న్యూఇయర్ ఫెస్టివ్..షేక్ జాయెద్ రోడ్, కీలక మార్గాలు మూసివేత..!!
- December 25, 2024
యూఏఈ: డిసెంబర్ 31 సాయంత్రం 4 గంటల నుండి షేక్ జాయెద్ రోడ్లోని ప్రధాన మార్గాలను మూసివేయనున్నారు. ఈ మేరకు ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ట్రాఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్సేన్ అల్ బనా తెలిపారు. డౌన్టౌన్ దుబాయ్, ఇతర ప్రసిద్ధ వేడుకలు జరిగే ప్రాంతాలకు వెళ్లే నివాసితులు, సందర్శకులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రారంభించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించాలని కోరారు. ఈ ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలకు హాజరుకాని వారు కూడా ముందుగానే ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. డిసెంబర్ 31 సాయంత్రం 4 గంటలకు అన్ని ప్రదేశాలలో రహదారులపై ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్: సాయంత్రం 4 గంటల నుండి మూసివేయబడుతుంది.
ఫైనాన్షియల్ సెంటర్ సెయింట్ లోయర్ డెక్: సాయంత్రం 4 గంటల నుండి మూసివేయబడుతుంది.
అల్ ముస్తక్బాల్ సెయింట్: సాయంత్రం 4 గంటల నుండి మూసివేయబడుతుంది.
బుర్జ్ ఖలీఫా సెయింట్: సాయంత్రం 4 గంటల నుండి మూసివేయబడుతుంది.
అల్ అసయెల్ రోడ్: సాయంత్రం 4 గంటల నుండి మూసివేయబడింది.
అల్ సుకుక్ సెయింట్: రాత్రి 8 గంటల నుండి మూసివేయబడుతుంది.
ఫైనాన్షియల్ రోడ్ పై స్థాయి: రాత్రి 9 గంటల నుండి మూసివేయబడింది.
షేక్ జాయెద్ రోడ్: రాత్రి 11 గంటల నుండి క్రమంగా మూసివేయబడుతుంది.
పార్కింగ్ ఏర్పాట్లు
న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ ప్రదర్శనలను చూడటానికి వచ్చే ప్రజలకు తగిన పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దుబాయ్ మాల్, జబీల్, ఎమ్మార్ బౌలేవార్డ్లో సుమారు 20వేల అదనపు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. నేరుగా డ్రైవ్ చేస్తూ వచ్చిన వారికి అల్ వాస్ల్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) పార్కింగ్ స్థలాలలో ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలు ఉన్నాయని, ఇక్కడ ఉచిత షటిల్ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. సందర్శకులు సెంటర్పాయింట్, ఎటిసలాట్ ఇ, జెబెల్ అలీ స్టేషన్ల వంటి పార్కింగ్ అందుబాటులో ఉన్న మెట్రో స్టేషన్లను ఉపయోగించాలని సూచించారు. దుబాయ్ వాటర్ కెనాల్ ఫుట్బ్రిడ్జ్ మరియు ఎలివేటర్లు సాయంత్రం 4 గంటలకు మూసివేయబడతాయన్నారు.
తాజా వార్తలు
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!









