సౌదీ అరేబియాలో 2 మిలియన్లు దాటిన ఫ్రీలాన్సర్ల నమోదు..!!
- December 25, 2024
రియాద్: సౌదీ అరేబియాలో ఫ్రీలాన్సింగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు సహాయపడే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మారింది. సెప్టెంబర్ 2024 నాటికి, ఫ్రీలాన్స్ ప్లాట్ఫారమ్లో 2.25 మిలియన్లకు పైగా వ్యక్తులు నమోదు చేసుకున్నారు. ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్కు పెరిగిన డిమాండ్ను ఇది ప్రతిబింబిస్తుంది. మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఫ్రీలాన్సింగ్ రంగాన్ని పెంచే లక్ష్యంతో 2019లో "ఫ్యూచర్ వర్క్" కంపెనీని స్థాపించింది. ఇది రిమోట్ పని, సౌకర్యవంతమైన గంటలు, ఫ్రీలాన్సింగ్ వంటి ఆధునిక పని విధానాలను ప్రచారం చేయడంపై దృష్టి పెడుతుంది. దీని లక్ష్యం ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, సౌదీ ప్రతిభను బలోపేతం చేయడం, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా సాంప్రదాయ వ్యవస్థను పూర్తి చేసే కొత్త కార్మిక మార్కెట్ను సృష్టించడం దీని లక్ష్యంగా నిర్దేశించారు.
ఫ్యూచర్ వర్క్ ఇటీవలి నివేదిక ప్రకారం.. వాణిజ్యం, రిటైల్ రంగం 38 శాతంతో ముందుంది. పరిశ్రమలు 13 శాతం, వ్యాపార సేవలు 11 శాతం ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీలు 62 శాతంతో, తర్వాత హైస్కూల్ గ్రాడ్యుయేట్లు 31 శాతం, ఉన్నత డిగ్రీలు పొందినవారు 7 శాతం మంది ఉన్నారు. డిజిటల్ ప్లాట్ఫారమ్లు ఫ్రీలాన్సర్లకు ముఖ్యంగా టెక్, ఇన్ఫర్మేషన్, ఫైనాన్స్లో కీలకంగా మారుతుంది. రియాద్లో అత్యధికంగా 27 శాతం మంది ఫ్రీలాన్సర్లు ఉన్నారు. మక్కా 22 శాతం, తూర్పు ప్రావిన్స్లో 14 శాతం మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 25-34 సంవత్సరాల వయస్సు గలవారు అత్యంత చురుగ్గా ఉండటం ఫ్రీలాన్సింగ్ పట్ల యువతలో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో 3.2 మిలియన్ల మంది మహిళలు ఫ్రీలాన్స్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారని నివేదికలో పేర్కొన్నారు.
సౌదీ GDPకి ఫ్రీలాన్సర్ల సహకారం ముఖ్యమైనది. 2023లో వీరు రెండు శాతం(SR72.5 బిలియన్లు)కు చేరుకుంది. రీఫ్ ప్రోగ్రామ్, సోషల్ డెవలప్మెంట్ బ్యాంక్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఫండ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఫ్రీలాన్సర్లకు సహాయక వాతావరణాన్ని అందించడం ద్వారా ఈ వృద్ధికి మరింత మద్దతునిచ్చాయని నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









