ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి..

- June 27, 2016 , by Maagulf
ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి..

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో మసీదును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
రంజాన్‌ మాసం సందర్భంగా అబు ఘరైబ్‌ మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి తనను తాను పేల్చుకునిఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడిలో 14 మంది మృతిచెందగా.. మరో 32 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com