రాచకొండ కమిషనరేట్: ఈ ఏడాది 42 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి
- December 26, 2024
హైదరాబాద్: ఈ ఏడాది 253 డ్రగ్స్ కేసులు నమోదు కాగా, 521 మంది నిందితులను అరెస్టు చేశాము. 88 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశాము అని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారిలో 165 మందికి హిస్టరీ షీడ్స్ ఓపెన్ చేశాము. ఈ ఏడాది 30 మంది నిందితులకు జీవిత ఖైదు పడేలా చేశాము. దేశంలోనే మొదటి స్థానంలో రాచకొండ కమిషనరేట్ ఉంది. లోక్ అధాలత్లో 11 వేలకు పైగా కేసులను పరిష్కరించాము. ఏడాది రెండు లక్షల 41 వేల 742 డయల్ 100కు రాచకొండ కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ అయ్యాయి. ప్రతి రెండు నిమిషాలకు ఒక ఫోన్ కాల్ అటెంప్ట్ చేశాము.
సైబర్ క్రైమ్ లో బాధితులకు 22 కోట్ల రూపాయల నగదను రీఫండ్ చేశాము. కమిషనరేట్ పరిధిలో జరిగిన 73 హత్య కేసులను చేధించాము. ఏడాది రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన చిన్న పిల్లల అమ్మకాలకు సంబంధించిన కేసును చేధించి 15 మంది పిల్లలను రిస్క్యూ చేశాము. ఈ ఏడాది 42 శాతంకు పైగా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. 53 మందికి పైగా సైబర్ క్రైమ్ నేరస్తులను అరెస్టు చేశాము. ఏడాది 15,62 కేసులో నమోదయ్యాయి. 2600 కు పైగా డ్రైవింగ్ లైసన్స్ లు రద్దు చేశాము అని రాచకొండ కమిషనర్ వివరించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









