రాచకొండ కమిషనరేట్: ఈ ఏడాది 42 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి
- December 26, 2024
హైదరాబాద్: ఈ ఏడాది 253 డ్రగ్స్ కేసులు నమోదు కాగా, 521 మంది నిందితులను అరెస్టు చేశాము. 88 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశాము అని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారిలో 165 మందికి హిస్టరీ షీడ్స్ ఓపెన్ చేశాము. ఈ ఏడాది 30 మంది నిందితులకు జీవిత ఖైదు పడేలా చేశాము. దేశంలోనే మొదటి స్థానంలో రాచకొండ కమిషనరేట్ ఉంది. లోక్ అధాలత్లో 11 వేలకు పైగా కేసులను పరిష్కరించాము. ఏడాది రెండు లక్షల 41 వేల 742 డయల్ 100కు రాచకొండ కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ అయ్యాయి. ప్రతి రెండు నిమిషాలకు ఒక ఫోన్ కాల్ అటెంప్ట్ చేశాము.
సైబర్ క్రైమ్ లో బాధితులకు 22 కోట్ల రూపాయల నగదను రీఫండ్ చేశాము. కమిషనరేట్ పరిధిలో జరిగిన 73 హత్య కేసులను చేధించాము. ఏడాది రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన చిన్న పిల్లల అమ్మకాలకు సంబంధించిన కేసును చేధించి 15 మంది పిల్లలను రిస్క్యూ చేశాము. ఈ ఏడాది 42 శాతంకు పైగా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. 53 మందికి పైగా సైబర్ క్రైమ్ నేరస్తులను అరెస్టు చేశాము. ఏడాది 15,62 కేసులో నమోదయ్యాయి. 2600 కు పైగా డ్రైవింగ్ లైసన్స్ లు రద్దు చేశాము అని రాచకొండ కమిషనర్ వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







