జపాన్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి
- December 26, 2024
జపాన్: జపాన్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.గురువారం (26వ తేదీ) విమాన టికెట్ల విక్రయాలను కూడా విమానయాన సంస్థ నిలిపివేసింది. విమానయాన సంస్థ బ్యాగేజీ చెక్ ఇన్ సిస్టమ్లో కూడా సమస్య తెలెత్తింది. జపాన్ ఎయిర్లైన్స్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ సైబర్ దాడి గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది.ఈ దాడిని ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
దీని పై సోషల్ మీడియా వేదికగా జపాన్ ఎయిర్లైన్స్ స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని పేర్కొంది. గురువారం బయలుదేరే జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు టికెట్ల విక్రయాలు నిలిపివేయడం జరిగిందని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి జెఏఎల్ క్షమాపణలు చెప్పింది. కాగా, జపాన్ ఎయిర్లైన్స్ (JAL)కు అల్ నిప్పన్ ఎయిర్వేస్ (ANI) తర్వాత దేశంలో రెండవ అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు ఉంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









