జపాన్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి
- December 26, 2024
జపాన్: జపాన్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.గురువారం (26వ తేదీ) విమాన టికెట్ల విక్రయాలను కూడా విమానయాన సంస్థ నిలిపివేసింది. విమానయాన సంస్థ బ్యాగేజీ చెక్ ఇన్ సిస్టమ్లో కూడా సమస్య తెలెత్తింది. జపాన్ ఎయిర్లైన్స్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ సైబర్ దాడి గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది.ఈ దాడిని ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
దీని పై సోషల్ మీడియా వేదికగా జపాన్ ఎయిర్లైన్స్ స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని పేర్కొంది. గురువారం బయలుదేరే జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు టికెట్ల విక్రయాలు నిలిపివేయడం జరిగిందని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి జెఏఎల్ క్షమాపణలు చెప్పింది. కాగా, జపాన్ ఎయిర్లైన్స్ (JAL)కు అల్ నిప్పన్ ఎయిర్వేస్ (ANI) తర్వాత దేశంలో రెండవ అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు ఉంది.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









