సిరియాలో పెరిగిన నిరసనలు, హోమ్స్లో కర్ఫ్యూ విధింపు
- December 26, 2024
సిరియా: డిసెంబర్ 25న, సిరియాలోని వివిధ ప్రాంతాలలో వేలాది మంది ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు సిరియాలో ఉద్రిక్తతలను పెంచిన విషయం. అలెప్పో నగరంలోని మైసలూన్ జిల్లాలోని అలవైట్ మందిరంపై దాడి చేయబడిన వీడియో ప్రసారం అయ్యింది. ఈ వీడియో చూపించడంతో దేశమంతటా నిరసనలు మరింత ముదిరాయి. కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ విధించడమే కాకుండా, ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరియన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ వీడియో పాతదని, దానిని పరివర్తన దశలో ప్రజల మధ్య కలహాలు సృష్టించడానికి తిరిగి ప్రచురించారని చెప్పింది. ఈ వీడియో సిరియాలో రాజకీయ ఒత్తిడి ఉన్న సమయంలో వాస్తవం కాకుండా చూపించబడిందని సిరియా ప్రభుత్వం ఆరోపించింది. అయినప్పటికీ, తిరుగుబాటు ప్రభుత్వంలో ఉన్న నాయకులు గుర్తు తెలియని గుంపు దాడికి పాల్పడినట్లు ఆరోపించారు.
సిరియాలో పశ్చిమ ప్రాంతంలో, హోమ్స్ మరియు వాయువ్య ప్రాంతం కర్దాహాలో నిరసనలు జరిగాయి. ఈ నిరసనల సమయంలో ఒకరు మరణించారని, మరొక ఐదుగురు గాయపడ్డారని నివేదికలు అందాయి. ఈ ఘటన తర్వాత, సిరియా అధికారులు 26 డిసెంబర్ వరకు హోమ్స్ నగరంలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు.ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, ప్రభుత్వ వర్గాలు శాంతిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
సిరియా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో, ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చినాయి. 2011లో ప్రారంభమైన సిరియా యుద్ధం ఇంకా ముగియలేదు, మరియు దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల మద్య ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం







