దుబాయ్‌లో అమ్నెస్టీ..236,000 మంది ఓవర్‌స్టేయర్లకు లబ్ధి..!!

- December 31, 2024 , by Maagulf
దుబాయ్‌లో అమ్నెస్టీ..236,000 మంది ఓవర్‌స్టేయర్లకు లబ్ధి..!!

దుబాయ్: దుబాయ్‌లో ఓవర్‌స్టేయర్‌ల స్థితిని సరిదిద్దడానికి చేపట్టిన గ్రేస్ పీరియడ్ గత నాలుగు నెలలుగా విజయవంతమైందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అల్ మర్రి చెప్పారు. 236,000 మంది ఓవర్‌స్టేయర్లు దుబాయ్‌లో తమ స్థితిని సరిదిద్దుకోవడానికి గ్రేస్ పీరియడ్ నుండి ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. దాదాపు 55వేల మంది ఇప్పటికే దుబాయ్ వీడి వెళ్లిపోయారని తెలిపారు.  

యూఏఈలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి స్థితిని సరిదిద్దడానికి, ఆర్థిక జరిమానాలు, పరిపాలనా పరిమితుల నుండి మినహాయింపు డిసెంబర్ 31తో ముగియనుంది.  గడువు ముగిసేలోపు ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP)  పిలుపునిచ్చింది. దుబాయ్‌లో క్షమాభిక్ష కాలంలో 236,000 మంది ఓవర్‌స్టేయర్లు స్థితిని సరిదిద్దుకున్నారని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com