దుబాయ్లో అమ్నెస్టీ..236,000 మంది ఓవర్స్టేయర్లకు లబ్ధి..!!
- December 31, 2024
దుబాయ్: దుబాయ్లో ఓవర్స్టేయర్ల స్థితిని సరిదిద్దడానికి చేపట్టిన గ్రేస్ పీరియడ్ గత నాలుగు నెలలుగా విజయవంతమైందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అల్ మర్రి చెప్పారు. 236,000 మంది ఓవర్స్టేయర్లు దుబాయ్లో తమ స్థితిని సరిదిద్దుకోవడానికి గ్రేస్ పీరియడ్ నుండి ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. దాదాపు 55వేల మంది ఇప్పటికే దుబాయ్ వీడి వెళ్లిపోయారని తెలిపారు.
యూఏఈలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి స్థితిని సరిదిద్దడానికి, ఆర్థిక జరిమానాలు, పరిపాలనా పరిమితుల నుండి మినహాయింపు డిసెంబర్ 31తో ముగియనుంది. గడువు ముగిసేలోపు ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) పిలుపునిచ్చింది. దుబాయ్లో క్షమాభిక్ష కాలంలో 236,000 మంది ఓవర్స్టేయర్లు స్థితిని సరిదిద్దుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









