తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- January 04, 2025
తెలుగు భాషను మనమేు కాపాడుకోవాలి
ఆ ఉద్యమం ఇంటి నుంచే ప్రారంభించాలి
మాతృ భాషలోనే మానవ మేధ వికసిస్తుంది
హైదరాబాద్: తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు.
‘ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహా సభల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మూడు రోజుల పాటు మన భాగ్యనగరంలో ఈ మహా సభలను నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య పెద్దలకు ప్రత్యేకంగా శ్రీమతి ఇందిరాదత్ గారికి, వారి బందానికి ప్రత్యేక క-తజ్ఇతలు. తెలుగు భాష, తెలుగు భాషా సంప్రదాయాలు, కళలను పరిరఒిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య గత 32 సంవత్సరాలుగా తమ సేవలు అందించడం నిజంంగా అభినందనీయం.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ అంటూ పాడుకునే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఒకే వేదికపైకి రావడం తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంప్రదాయాల కోసం పాటు పడటం చాలా సంతోషంగా ఉంది. భారత దేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు ఒక్కటి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్క-తం ప్రాచీన భాషలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాయి. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఊరికే అనలేదు. తెలుగు భాష ప్రపంచంలోనే అత్యంత అందమైన భాష. తెలుగు పదాలు, శ్రావ్యంగా వినేవారికి సంగీతాన్ని విన్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం చాలామంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు.తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతున్నారు. సోషల్ మీడియాలో కానీ... లెటర్లు కానీ..తెలుగు పదాలను కూడా ఇంగ్లీషులో రాస్తున్నారు.ఇది చాలా బాధాకరం.ఇంట్లో కూడా మనం మాట్లాడే భాషలో 30 శాతం మాత్రమే తెలుగులో మాట్లాడుతున్నాం.మిగిలినదంతా ఇంగ్లిష్లోనే మాట్లాడుతున్నాం.ఒకప్పుడు అందరూ అన్ని వస్తువులను తెలుగులోనే మాట్లాడే వారు. కానీ మనమే ఇలా ఇంగ్లిష్లో మాట్లాడి తెలుగును నిర్వీర్యం చేస్తున్నాం. అందుకే ఇప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకుందాం.’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
నిజాం కాలంలో తెలుగుపై వివక్ష
నిజాం కాలంలో తెలుగు భాషపై అణచివేత కొనసాగింది...ఉర్దూ మీడియం స్కూల్సే ఉండేవి... తెలుగు వాళ్లు అక్కడే చదువుకోవాల్సి వచ్చేది.నిర్చంది కాండ కొనసాగింది.అంత నిర్బంధంలో కూడా నాడు గ్రంథాలయోద్యమం, 'ఆంధ్ర మహాసభ' పేరిట తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు అనేక పోరాటాలు సాగాయి.ఇక, యక్షగానం, భాగవతం, నాటకం వంటివి తెలుగు భాషకే ప్రత్యేకమైన కళా రూపాలు... ప్రపంచంలో అవధానం అనేది తెలుగు, సంస్కృతంలో తప్పిస్తే మరే భాషలోనూ కనపడదు.’
‘చైనా, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, తైవాన్, ఆయా దేశపాలన మాడతాయి వంటి దేశాల్లో మాతృభాషలోనే విద్య కొనసాగుతోంది. ఆయా దేశాలు ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందలేదా? వారు తమ మాతృభాషను అంతరిక్షంలోకి వెళ్లడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు.. కానీ మనం ప్రాథమిక విద్యకు కూడా మాతృభాష ఉపయోగించుకోవడం లేదు. తెలుగు భాఫ ప్రేమికుడిగా ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇంగ్లీషు నేర్చుకుంటేనే ఉద్యోగం, అభివృద్ధి అనేది గత వలస పాలకులు అందించిన చీకటి వారసత్వం.. దీన్ని మనం వదిలిచంచుకోవాలి. ఒక జాతి చరిత్ర, సంస్కృతుల వికాస పరిరక్షణలో ఆ జాతీయులు మాట్లాడే భాషలదే కీలక పాత్ర..అందుకే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్య విధానంలో మాతృభాషకు పెద్దపేట వేశారు. మభారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. మానవమేధ మాతృభాషలోనే వికసిస్తుంది.తల్లి కడుపులో శిశువు పెరుగుతున్న క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుంది..పరభాషలో ఎంత అధ్యయనం.చేసినా, నైపుణ్యం అలవడినా ఆ స్థాయిలో మేధస్సు అలవడదు’ అని మంత్రి వివరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







