హైదరాబాద్లో దాడులకు ఐసిస్ కుట్ర
- June 28, 2016
హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరులు ఉన్నారనే అనుమానంతో దాడులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారమందడంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం నుంచి రంగంలోకి దిగారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలువురు ఐసిస్ సానుభూతిపరులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐసిస్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. మరో వైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి టర్కీ వెళ్లే విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







