కేశినేని నాని క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదు-- వంగవీటి రాధా

- June 28, 2016 , by Maagulf
కేశినేని నాని క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదు-- వంగవీటి రాధా

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో విజయవాడలో జన జీవనాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.
 
నగరంలో రోడ్ల విస్తరణ పేరిట ఇటీవల అధికారులు పలు పురాతన ఆలయాలను తొలగించారు. అంతేగాక, అధికారులను అడ్డుకున్న గోశాల నిర్వాహకులపై ఎంపీ హోదాలో ఉన్న నాని దుర్భాషలాడారనే ఆరోపణలు వచ్చాయి. 'అభివృద్ధిని అడ్డుకుంటారా?... ఎవడ్రా వీడు.. వీరి ఓట్లు మనకవసం లేదు' అని నాని దుర్భాషలాడినట్లు సమాచారం. 

ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, హిందూ పరిరక్షణ సమితిలు నాని వైఖరికి నిరసనగా బుధవారం బెజవాడ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా మంగళవారం వంగవీటి రాధ మాట్లాడుతూ.. నాని క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com