APSRTC: సంక్రాంతి బంపర్ ఆఫర్
- January 07, 2025
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సులో ఒకేసారి రెండువైపులా టికెట్ బుక్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది.
సంక్రాంతి పండుగ దృష్ట్యా 7,200 అదనపు బస్సులను తెలంగాణ , ఇతర రాష్ట్రాలకు నడపాలని సంస్థ నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ మంగళవారం వెల్లడించారు. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు అదనపు బస్సులను నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153, బెంగళూరు నుంచి పలు చోట్లకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 బస్సులను నడుపనున్నామని వివరించారు. తిరుగు ప్రయాణాలకు ఈనెల 16 నుంచి 20 వరకు 3200 ప్రత్యేక బస్సులు అన్ని ప్రాంతాలకు నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని ఎండీ తెలిపారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









