భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పిన TTD పాలక మండలి
- January 10, 2025
తిరుమల: తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. తమ తప్పు లేకపోయినా సరే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. అయితే టీటీడీ బోర్డు సమావేశం జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు తరఫున ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో తాను క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
పాలకమండలి సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీర్ నాయుడు మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగి రారు కదా?.. ఎవరో ఏదో మాట్లాడారని దానిపై స్పందించాల్సిన పనిలేదు’. అని అన్నారు. అయితే టీటీడీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఉన్నందున దానిపై మరోసారి మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు తాము పాటిస్తున్నామని, తమ తప్పు లేకపోయినా సరే.. క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. దీంతో పాటుగా బీఆర్ నాయుడు చేసినవ్యాఖ్యలపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తాను చేసిన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
‘నా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదు.. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా.. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలి’ ఆయన అన్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









