ప్రవాసులకు షాకిచ్చిన బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- January 12, 2025
మనామా: బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖలో ఉద్యోగ జాతీయీకరణ వేగంగా జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం.. విదేశీ ఉద్యోగుల స్థానంలో బహ్రెయిన్ పౌరులను నియమించడంలో విద్యా మంత్రిత్వ శాఖ గణనీయమైన పురోగతిని సాధించింది. 2020- 2023 మధ్య విద్యా మంత్రిత్వ శాఖ 2672 మంది బహ్రెయిన్ పౌరులను నియమించింది. అదే సమయంలో 986 మంది విదేశీ ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం, 3074 మంది విదేశీయులు మంత్రిత్వ శాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పారిశ్రామిక విద్య, ఫ్రెంచ్ భాషా బోధన, సంగీత విద్యతో సహా పలు ప్రత్యేక రంగాలలో విదేశీ ఉపాధ్యాయులు కీలక పాత్రలు పోషిస్తున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధిక అర్హత కలిగిన బహ్రెయిన్ గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో సైన్స్, మ్యాథమెటిక్స్, అరబిక్, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లీషు కోసం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు, రాబోయే సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







