ప్రవాసులకు షాకిచ్చిన బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- January 12, 2025
మనామా: బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖలో ఉద్యోగ జాతీయీకరణ వేగంగా జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం.. విదేశీ ఉద్యోగుల స్థానంలో బహ్రెయిన్ పౌరులను నియమించడంలో విద్యా మంత్రిత్వ శాఖ గణనీయమైన పురోగతిని సాధించింది. 2020- 2023 మధ్య విద్యా మంత్రిత్వ శాఖ 2672 మంది బహ్రెయిన్ పౌరులను నియమించింది. అదే సమయంలో 986 మంది విదేశీ ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం, 3074 మంది విదేశీయులు మంత్రిత్వ శాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పారిశ్రామిక విద్య, ఫ్రెంచ్ భాషా బోధన, సంగీత విద్యతో సహా పలు ప్రత్యేక రంగాలలో విదేశీ ఉపాధ్యాయులు కీలక పాత్రలు పోషిస్తున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధిక అర్హత కలిగిన బహ్రెయిన్ గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో సైన్స్, మ్యాథమెటిక్స్, అరబిక్, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లీషు కోసం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు, రాబోయే సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







