ప్రవాసులకు షాకిచ్చిన బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- January 12, 2025
మనామా: బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖలో ఉద్యోగ జాతీయీకరణ వేగంగా జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం.. విదేశీ ఉద్యోగుల స్థానంలో బహ్రెయిన్ పౌరులను నియమించడంలో విద్యా మంత్రిత్వ శాఖ గణనీయమైన పురోగతిని సాధించింది. 2020- 2023 మధ్య విద్యా మంత్రిత్వ శాఖ 2672 మంది బహ్రెయిన్ పౌరులను నియమించింది. అదే సమయంలో 986 మంది విదేశీ ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం, 3074 మంది విదేశీయులు మంత్రిత్వ శాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పారిశ్రామిక విద్య, ఫ్రెంచ్ భాషా బోధన, సంగీత విద్యతో సహా పలు ప్రత్యేక రంగాలలో విదేశీ ఉపాధ్యాయులు కీలక పాత్రలు పోషిస్తున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధిక అర్హత కలిగిన బహ్రెయిన్ గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో సైన్స్, మ్యాథమెటిక్స్, అరబిక్, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లీషు కోసం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు, రాబోయే సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









