యూఏఈలో Dh120,000 వరకు స్కూల్ ఫీజు..20% హైక్..!!
- January 13, 2025
యూఏఈ: యూఏఈ ప్రీమియం పాఠశాలల్లో దాదాపు 20 శాతం పెరుగుదలతో Dh120,000 వరకు అధిక ఫీజు ఉంది. దుబాయ్కి వచ్చే కొత్త కుటుంబాలు వీటిల్లో తమ పిల్లలను చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని GEMS ఎడ్యుకేషన్ గ్రూప్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లిసా క్రౌస్బీ తెలిపారు. "మా ప్రీమియం పాఠశాలల్లో నమోదు..సంవత్సరానికి నాలుగు శాతం పెరగింది. సెప్టెంబర్ 2025 నాటికి అవి మరింత 6.5 శాతం పెరుగుతాయని అంచనా. మా వృద్ధి అంతటా అబుదాబిలో వివిధ ప్రదేశాలలో 13 ప్రపంచ స్థాయి ప్రీమియం పాఠశాలలను నిర్వహిస్తున్నాము." అని తెలిపారు. తమ పాఠశాలల్లో కల్పించే సౌకర్యాలను బట్టి ఫీజులు Dh35,000 నుండి Dh120,000 వరకు ఉంటాయని క్రాస్బీ తెలిపారు. Q1 2024-25లో Dh306.1 మిలియన్ల నిర్వహణ ఆదాయాలను నివేదించింది. ఇది సంవత్సరానికి 14.8 శాతం పెరుగుదలను సూచిస్తుంది. యూఏఈలోని ప్రముఖ K-12 ఎడ్యుకేషన్ ప్రొవైడర్ ప్రకారం.. ప్రీమియం పాఠశాలల్లో నమోదు కూడా అదే కాలంలో 18.7 శాతం పెరిగిందని, ఈ సంవత్సరం రెండు కొత్త పాఠశాలలతో సహా మొత్తం 12 ప్రీమియం పాఠశాలలు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ప్రవేశాల కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య దాదాపు 35 శాతం పెరిగిందని GEMS ఫస్ట్పాయింట్ స్కూల్ – ది విల్లా ప్రిన్సిపాల్ డేవిడ్ వేడ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







