యూఏఈలో Dh120,000 వరకు స్కూల్ ఫీజు..20% హైక్..!!
- January 13, 2025
యూఏఈ: యూఏఈ ప్రీమియం పాఠశాలల్లో దాదాపు 20 శాతం పెరుగుదలతో Dh120,000 వరకు అధిక ఫీజు ఉంది. దుబాయ్కి వచ్చే కొత్త కుటుంబాలు వీటిల్లో తమ పిల్లలను చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని GEMS ఎడ్యుకేషన్ గ్రూప్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లిసా క్రౌస్బీ తెలిపారు. "మా ప్రీమియం పాఠశాలల్లో నమోదు..సంవత్సరానికి నాలుగు శాతం పెరగింది. సెప్టెంబర్ 2025 నాటికి అవి మరింత 6.5 శాతం పెరుగుతాయని అంచనా. మా వృద్ధి అంతటా అబుదాబిలో వివిధ ప్రదేశాలలో 13 ప్రపంచ స్థాయి ప్రీమియం పాఠశాలలను నిర్వహిస్తున్నాము." అని తెలిపారు. తమ పాఠశాలల్లో కల్పించే సౌకర్యాలను బట్టి ఫీజులు Dh35,000 నుండి Dh120,000 వరకు ఉంటాయని క్రాస్బీ తెలిపారు. Q1 2024-25లో Dh306.1 మిలియన్ల నిర్వహణ ఆదాయాలను నివేదించింది. ఇది సంవత్సరానికి 14.8 శాతం పెరుగుదలను సూచిస్తుంది. యూఏఈలోని ప్రముఖ K-12 ఎడ్యుకేషన్ ప్రొవైడర్ ప్రకారం.. ప్రీమియం పాఠశాలల్లో నమోదు కూడా అదే కాలంలో 18.7 శాతం పెరిగిందని, ఈ సంవత్సరం రెండు కొత్త పాఠశాలలతో సహా మొత్తం 12 ప్రీమియం పాఠశాలలు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ప్రవేశాల కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య దాదాపు 35 శాతం పెరిగిందని GEMS ఫస్ట్పాయింట్ స్కూల్ – ది విల్లా ప్రిన్సిపాల్ డేవిడ్ వేడ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









