BAPS హిందూ మందిర్ ను సందర్శించిన 20దేశాల డిఫిన్స్ అధికారులు..!!
- January 15, 2025
అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ను 20 కంటే ఎక్కువ రాయబార కార్యాలయాలకు చెందిన డిఫిన్స్ అధికారులు, వారి కుటుంబాలు సందర్శించారు. BAPS స్వామినారాయణ్ సంస్థ కృషితో నిర్మించిన మందిర్ ప్రారంభమైన ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ప్రపంచం నలుమూలల నుండి రెండు మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. బెల్జియం, కెనడా, కొమొరోస్ ద్వీపం, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇండియా, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, కొరియా, మొజాంబిక్, టాంజానియా, సెర్జియా, స్విట్జర్లాండ్ దేశాల రక్షణ శాఖ అధికారులు ఉన్నారు. ప్రతినిధులకు BAPS బోర్డు సభ్యులు, వాలంటీర్లు సంప్రదాయ దండలు మరియు గులాబీలతో సాదరంగా స్వాగతం పలికారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ అద్భుతమైన ప్రయాణాన్ని తెలిపే 'ది 'ఫెయిరీ టేల్' ప్రదర్శనను చూసి ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు. మందిర్ ముఖద్వారంపై చెక్కబడిన ప్రాచీన నాగరికత విలువను తెలియజేసే కళాత్మకతను చూసి ప్రశాలు కురిపించారు. అనంతరం ప్రతినిధులు తమ ఆలోచనలను పంచుకోవడంతో వారి పర్యటన ముగిసింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







