BAPS హిందూ మందిర్ ను సందర్శించిన 20దేశాల డిఫిన్స్ అధికారులు..!!
- January 15, 2025
అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ను 20 కంటే ఎక్కువ రాయబార కార్యాలయాలకు చెందిన డిఫిన్స్ అధికారులు, వారి కుటుంబాలు సందర్శించారు. BAPS స్వామినారాయణ్ సంస్థ కృషితో నిర్మించిన మందిర్ ప్రారంభమైన ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ప్రపంచం నలుమూలల నుండి రెండు మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. బెల్జియం, కెనడా, కొమొరోస్ ద్వీపం, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇండియా, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, కొరియా, మొజాంబిక్, టాంజానియా, సెర్జియా, స్విట్జర్లాండ్ దేశాల రక్షణ శాఖ అధికారులు ఉన్నారు. ప్రతినిధులకు BAPS బోర్డు సభ్యులు, వాలంటీర్లు సంప్రదాయ దండలు మరియు గులాబీలతో సాదరంగా స్వాగతం పలికారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ అద్భుతమైన ప్రయాణాన్ని తెలిపే 'ది 'ఫెయిరీ టేల్' ప్రదర్శనను చూసి ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు. మందిర్ ముఖద్వారంపై చెక్కబడిన ప్రాచీన నాగరికత విలువను తెలియజేసే కళాత్మకతను చూసి ప్రశాలు కురిపించారు. అనంతరం ప్రతినిధులు తమ ఆలోచనలను పంచుకోవడంతో వారి పర్యటన ముగిసింది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









