BAPS హిందూ మందిర్ ను సందర్శించిన 20దేశాల డిఫిన్స్ అధికారులు..!!
- January 15, 2025
అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ను 20 కంటే ఎక్కువ రాయబార కార్యాలయాలకు చెందిన డిఫిన్స్ అధికారులు, వారి కుటుంబాలు సందర్శించారు. BAPS స్వామినారాయణ్ సంస్థ కృషితో నిర్మించిన మందిర్ ప్రారంభమైన ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ప్రపంచం నలుమూలల నుండి రెండు మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. బెల్జియం, కెనడా, కొమొరోస్ ద్వీపం, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇండియా, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, కొరియా, మొజాంబిక్, టాంజానియా, సెర్జియా, స్విట్జర్లాండ్ దేశాల రక్షణ శాఖ అధికారులు ఉన్నారు. ప్రతినిధులకు BAPS బోర్డు సభ్యులు, వాలంటీర్లు సంప్రదాయ దండలు మరియు గులాబీలతో సాదరంగా స్వాగతం పలికారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ అద్భుతమైన ప్రయాణాన్ని తెలిపే 'ది 'ఫెయిరీ టేల్' ప్రదర్శనను చూసి ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు. మందిర్ ముఖద్వారంపై చెక్కబడిన ప్రాచీన నాగరికత విలువను తెలియజేసే కళాత్మకతను చూసి ప్రశాలు కురిపించారు. అనంతరం ప్రతినిధులు తమ ఆలోచనలను పంచుకోవడంతో వారి పర్యటన ముగిసింది.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









