యూఏఈలో నీరు, విద్యుత్ పై టారిఫ్ పెంపు..క్లారిటీ..!!

- January 16, 2025 , by Maagulf
యూఏఈలో నీరు, విద్యుత్ పై టారిఫ్ పెంపు..క్లారిటీ..!!

యూఏఈ: నీరు, ఇంధన వినియోగాన్ని ఆదా చేయడానికి వాటి వినియోగంపై టారిఫ్ లను అవసరం ఉండదని యూఏఈ ఇంధన మంత్రిత్వ శాఖ అధికారితెలిపారు. “గత మూడు సంవత్సరాలలో ఇంధన ఆదాను పాటించాము. కాబట్టి  టారిఫ్ లను పెంచడం వంటి దూకుడు చర్యలు అవసరం లేదు.” అని ఇంధన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలో నిర్వహణ డైరెక్టర్ మౌజా అల్ నీమి అన్నారు. భవనాలు, పరికరాల పునరుద్ధరణ ఆ తగ్గింపుకు దోహదపడిందని తెలిపారు. మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రణాళికలు ఇది కొనసాగుతాయని పేర్కొన్నారు.  

2050 నాటికి యూఏఈ రోడ్లపై నడిచే అన్ని వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు (ఇవిలు) 50 శాతం ఉండేలా మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం, యూఏఈలోని అన్ని వాహనాలలో ఎలక్ట్రిక్ వాహనాలు 3 శాతంగా ఉన్నాయి. ఉత్తర ఎమిరేట్స్‌లో నెట్‌వర్క్ పునరావాసం కోసం దాదాపు అర బిలియన్ దిర్హామ్‌ల విలువైన ప్రధాన ఇంధన, నీటి సంరక్షణ ప్రాజెక్టులను ఎతిహాద్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ (ఎతిహాద్‌డబ్ల్యుఇ) ఆవిష్కరించిన సందర్భంగా అల్ నీమి వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్‌లో మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com