విజిట్ వీసా టూ వర్క్ పర్మిట్.. నిషేధ చట్టాన్ని ఆమోదించిన బహ్రెయిన్ పార్లమెంట్..!!
- January 16, 2025
మనామా: కార్మిక మార్కెట్ను సంస్కరించే ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా బహ్రెయిన్ పార్లమెంటు విజిట్ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిషేధించే ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. 1965 ఏలియన్స్(వలస, నివాసం) చట్టాన్ని లక్ష్యంగా చేసుకుని, ఈ పద్ధతిని స్పష్టంగా నిషేధించే కొత్త ఆర్టికల్ను ప్రవేశపెట్టారు. దీంతోపాటు చట్టంలో ఏవైనా వ్యతరేక నిబంధనలను రద్దు చేసే నిబంధనలు ఉన్నాయి. దాని అమలు కోసం మార్గదర్శకాలను నిర్దేశిస్తారు.మొదట మే 2023లో ప్రవేశపెట్టిన ఈ ముసాయిదా చట్టం బహ్రెయిన్ జాతీయులకు ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రభుత్వ దీర్ఘకాలిక కార్మిక మార్కెట్ వ్యూహంతో రూపొందించారు. స్థానిక ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి, కొన్ని రంగాలలో విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ చట్టంలో కొన్ని నిబంధనలకు సవరణలు ప్రతిపాదించారు.లెజిస్టేటివ్ ప్రక్రియ ద్వారా ముసాయిదా చట్టం తుది ఆమోదం పొందగానే, వెంటనే అమల్లోకి వస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







