విజిట్ వీసా టూ వర్క్ పర్మిట్.. నిషేధ చట్టాన్ని ఆమోదించిన బహ్రెయిన్ పార్లమెంట్..!!
- January 16, 2025
మనామా: కార్మిక మార్కెట్ను సంస్కరించే ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా బహ్రెయిన్ పార్లమెంటు విజిట్ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిషేధించే ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. 1965 ఏలియన్స్(వలస, నివాసం) చట్టాన్ని లక్ష్యంగా చేసుకుని, ఈ పద్ధతిని స్పష్టంగా నిషేధించే కొత్త ఆర్టికల్ను ప్రవేశపెట్టారు. దీంతోపాటు చట్టంలో ఏవైనా వ్యతరేక నిబంధనలను రద్దు చేసే నిబంధనలు ఉన్నాయి. దాని అమలు కోసం మార్గదర్శకాలను నిర్దేశిస్తారు.మొదట మే 2023లో ప్రవేశపెట్టిన ఈ ముసాయిదా చట్టం బహ్రెయిన్ జాతీయులకు ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రభుత్వ దీర్ఘకాలిక కార్మిక మార్కెట్ వ్యూహంతో రూపొందించారు. స్థానిక ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి, కొన్ని రంగాలలో విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ చట్టంలో కొన్ని నిబంధనలకు సవరణలు ప్రతిపాదించారు.లెజిస్టేటివ్ ప్రక్రియ ద్వారా ముసాయిదా చట్టం తుది ఆమోదం పొందగానే, వెంటనే అమల్లోకి వస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









