వైకుంఠ ద్వారా దర్శన ఎస్ఎస్డీ టోకెన్ల పై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష
- January 16, 2025
తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డీ టోకెన్లపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఉన్నతాధికారులతో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జనవరి 19తో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ మణికంఠ చందోలు, ఇతర అధికారులు ఎస్ఎస్డీ టోకెన్లపై సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశంలో కొన్ని ముఖ్యాంశాలు:
- తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉంది.
- జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబడవు. వారు సర్వదర్శనం క్యూ లైన్లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
- జనవరి 19న ఆఫ్లైన్లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయబడవు.
- అదేవిధంగా, జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది.ఈ కారణంగా జనవరి 19న VIP బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
- పైన పేర్కొన్న సూచనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకుని టిటిడికి సహకరించాలని కోరడమైనది.
ఈ సమావేశంలో GM(IT) శేషా రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీవో సదాలక్ష్మి తదితర అధికారులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!









