వైకుంఠ ద్వారా దర్శన ఎస్ఎస్డీ టోకెన్ల పై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష
- January 16, 2025
తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డీ టోకెన్లపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఉన్నతాధికారులతో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జనవరి 19తో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ మణికంఠ చందోలు, ఇతర అధికారులు ఎస్ఎస్డీ టోకెన్లపై సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశంలో కొన్ని ముఖ్యాంశాలు:
- తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉంది.
- జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబడవు. వారు సర్వదర్శనం క్యూ లైన్లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
- జనవరి 19న ఆఫ్లైన్లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయబడవు.
- అదేవిధంగా, జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది.ఈ కారణంగా జనవరి 19న VIP బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
- పైన పేర్కొన్న సూచనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకుని టిటిడికి సహకరించాలని కోరడమైనది.
ఈ సమావేశంలో GM(IT) శేషా రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీవో సదాలక్ష్మి తదితర అధికారులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







