ఏపీకి 18న అమిత్ షా రాక
- January 17, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్టీఆ ర్ఎఫ్, ఎస్ఐడీఎం ప్రాంగణాలను ఆయన ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం ఎస్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆ ర్ఎఫ్ పదో బెటాలియన్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మో హన్ నాయుడు, బండి సంజయ్, డిప్యూ టీసీఎం పవన్, రాష్ట్ర హోంమంత్రి అనిత, తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం షా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఏపీకి పలు వరాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









