60 ఏళ్ల ఇండియన్ రిటైర్డ్ అకౌంటెంట్ సొంతమైన Dh1 మిలియన్..!!
- January 18, 2025
యూఏఈ: ఇండియాలోని కర్ణాటకకు చెందిన 60 ఏళ్ల రిటైర్డ్ అకౌంటెంట్ సుందర్ మరకాల.. 25 ఏళ్లపాటు దుబాయ్లో నివసించారు. తాజా బిగ్ టికెట్ ఇ-మిలియనీర్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను ఆయన గెలుచుకున్నారు. అబుదాబి డ్రాలో సుందర్ మరకాల ఈ వారం విజేతగా నిలిచారు. అతను 2021 వరకు దుబాయ్లో నివసించారు. అనంతరం తన భార్య, కుమార్తెతో కలిసి తన స్వగ్రామంలో స్థిరపడ్డారు. సుందర్ మరకాల మాట్లాడుతూ.. "ఇది నా మొదటి గెలపు. నేను మొదట నమ్మలేకపోయాను. నేను ఆనందంలో మునిగిపోయాను. కానీ అది స్కామ్ కాదని నిర్ధారించుకున్న తర్వాత మరింత సంతోషం కలిగింది. బహుమతిలో కొంత భాగాన్ని తన సోదరి, ఆమె కుటుంబ సభ్యులకు ఇస్తాను. మిగిలిన వాటిని ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు.’’ అని పేర్కొన్నారు.
25 మిలియన్ దిర్హాంల గ్రాండ్ ప్రైజ్
జనవరిలో గ్రాండ్ ప్రైజ్ Dh25 మిలియన్. ప్రతి టిక్కెట్ కొనుగోలు పాల్గొనేవారికి గ్రాండ్ ప్రైజ్ని గెలుచుకునే అవకాశం మాత్రమే కాకుండా ఈ నెల మొత్తంలో ప్రతి వారం Dh1 మిలియన్లను గెలుచుకునే అవకాశం కోసం వీక్లీ డ్రాలలోకి ప్రవేశాన్ని కల్పిస్తారు.
తాజా వార్తలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!







