జెనిన్పై ఇజ్రాయెల్ దాడి..తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- January 25, 2025
మస్కట్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో జెనిన్పై ఇటీవల ఇజ్రాయెల్ దాడి చేసి అమాయక పౌరుల మరణానికి దారితీసింది. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆస్తికి విస్తృతంగా నష్టం కలిగించడాన్ని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. కొనసాగుతున్న దాడులను ఆపడానికి తక్షణ చర్య తీసుకోవాలని, అంతర్జాతీయ చట్టపరమైన , మానవతా చట్టం ప్రకారం ఇజ్రాయెల్ ను బాధ్యులను చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆక్రమిత భూభాగాల్లో పాలస్తీనా ప్రజల బాధలను తుదముట్టించి న్యాయాన్ని స్థాపించాల్సిన తక్షణ అవసరం ఉందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, అరబ్ పీస్ ఇనిషియేటివ్ ఆధారంగా న్యాయమైన, శాశ్వతమైన శాంతిని సాధించడానికి ఒమన్ తన స్థిరమైన నిబద్ధతను కొనసాగిస్తుందని పునరుద్ఘాటించింది. యుద్ధం వల్ల ప్రభావితమైన పౌరుల హక్కులు, జీవితాలను రక్షించడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









