ఒకే పేరు ఉన్న ఇద్దరు బాలురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
- June 30, 2016
మృత్యువు సైతం పేర్ల ప్రకారం.... జాబితా వెతక్కోని మరీ ప్రాణాలను తీసుకువెళుతుందా అన్నట్లు ఉంది ఈ దుర్ఘటన. ఒకే రోజు ఒకే పేరు ఉన్న ఇద్దరు బాలురు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం విడ్డురంగా ఉందని బహ్రయినీయులు విస్తుపోతున్నారు. ఫిరోజ్ మహ్మద్ అహ్మద్, మూడు ఏళ్ల ఈజిప్టు బాలుడు తప్పిపోయినట్లు పిర్యాదు చేసిన కొన్న గంటల తర్వాత చనిపోయినట్లు కనుగొనబడింది.ఆ బాలుడు సోమవారం మధ్యాహ్నం పొరుగున ఉన్న పిల్లలతో ఆడుతున్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో తన తల్లి అతనికి పిలిచినపుడు ఆ బాలుడు ఎక్కడ ఉన్నాడో ఎవరూ కనిపెట్టలేదు ఆ కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ బాలుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు జరిగినది. సోషల్ మీడియా ఆ బాలుని చిత్రాన్ని పోస్ట్ చేసి ప్రచారం కల్పించారు.అతని గురించి ఏ సమాచారం లభించినా తెలియచేయాలని కోరారు. మంగళవారం ఉదయం ఆ బాలుని శరీరం వారి ఇంటి పొరుగున ఉన్న కారు ట్రంక్ లోపల కనుగొనబడింది, ఒక ఫార్మసీలో పనిచేస్తున్న సుడాన్ దేసనానికి చెందిన వ్యక్తి తన ఆవరణలో నిలిపి ఉన్న ఒక కారు లోపల కుళ్ళి కంపుకొడుతున్న వాసన వస్తుందని పొరుగువాళ్లకు నివేదించారు. పోలీసులు ఇప్పటికీ ఈ సంఘటన గూర్చి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే పేరు గల మరో బాలుడు ఫిరోజ్ అబ్దుల్ ఇమాఎం 7 ఏళ్ల బాలుడిని బహ్రేయినీ పశ్చిమ రాజధాని మనామాలో బనీ జంటా గ్రామంలో ఒక కారు డీ కొట్టడంతో సోమవారం మృతి చెందాడు. విధి ఆడిన వింత నాటకంలో అతని గమ్యం ఒక విషాద కారు ప్రమాదంలో ముగియబడింది ," ఆ బాలుని బంధువు చెప్పారు. " ఫిరోజ్ చాలా మంచి బాలుడు ఇరుగుపొరుగు పిల్లల ప్రశంసలు మరియు బంధువులు, పొరుగువారు, స్నేహితులు మధ్య ఎంతో ప్రజాదరణ పొందాడు . అతని హఠాన్మరణం మాకు ఒక పెద్ద షాక్, అది కష్టం భయంకరమైన వాస్తవం అంగీకరించడానికి మనస్సు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా ఫిరోజు తల్లి వచ్చి మా అబ్బాయి ఎపుడు ఇంటికి వస్తాడని ప్రతి ఒక్కరిని అడుగుతూ అడుగుతుంది.
సామాజిక మీడియాలో ఈ రెండు మరణాల గూర్చి విషాద నేపథ్యం బాహిరేణీయులు ఐక్యత భావనను వ్యక్తం కాబడింది.ఇద్దరు పిల్లలు మరియు వారి పేర్లు యాదృచ్చికంగా వయసులోనూ ఒకే బాధ ..ఒకే మరణ కోణాన్ని ఆవిష్కరించింది. "రెండు పువ్వులు, ఒకే రోజున వాడి పోయాయి ఒకరు కారులో ఎక్కి ... మరొకరిపై కారు ఎక్కి చనిపోయారని ఒక మీడియా యూజర్ చెప్పారు. "వారు మైళ్ల దూరంలో ఉన్నారు..కానీ వాళ్ళ ఒకే పేర్లు , ఫిరోజ్ వారి అమాయకత్వం..వారి చిన్ని గుండెలతో పెనవేసుకున్నబంధాల విలువ పంచుకున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







