ఏపీ: నిరు పేద‌ల‌కు ఉచితంగా ఇళ్ల స్థ‌లాలు

- January 27, 2025 , by Maagulf
ఏపీ: నిరు పేద‌ల‌కు ఉచితంగా ఇళ్ల స్థ‌లాలు

అమరావతి: బీపీఎల్ కుటుంబాలకే ఉచిత ఇంటిస్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాలపరిమితితో ప్రీహోల్డ్ కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇవ్వనున్నట్లు తెలిపింది. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని, కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో లబ్ధిదారుగా ఉండకూడదని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల‌లో ఉన్న నిరుపేద‌ల‌కు మూడు సెంట్లు, ప‌ట్ట‌ణ ప్రాంతాలోని పేద‌ల‌కు రెండు సెంట్లు భూమి ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com