మెయిడ్స్‌ రిటర్న్‌: ఒమన్‌తో భారత్‌ చర్చలు

- June 30, 2016 , by Maagulf
మెయిడ్స్‌ రిటర్న్‌: ఒమన్‌తో భారత్‌ చర్చలు

భారత ప్రభుత్వం, 14 మంది హౌస్‌ మెయిడ్స్‌ని ఒమన్‌ నుంచి భారత్‌కి రప్పించేందుకు సంప్రదింపులు ప్రారంభించింది. వీరంతా తమిళనాడుకు చెందినవారు. ఆర్థిక ఇబ్బందులతో ఒమన్‌లో ఇరుక్కుపోయిన ఈ 14 మంది హౌస్‌మెయిడ్స్‌ విషయంలో మద్రాస్‌ హైకోర్టులో విచారణ జరుగుతోంది. వారిలో ఓ మహిళ తల్లి, న్యాయస్థానంలో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ని దాఖలు చేశారు. న్యాయస్థానం, ఆ మహిళల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నెలకు 114 ఒమన్‌ రియాల్స్‌ (సుమారు 20,000 రూపాయలు నెలకు) జీతానికి ఒమన్‌లో పనిచేస్తోంది మేఘల. రోజుకి 22 గంటల పాటు ఆమె అక్కడ పనిచేయాల్సి వస్తోంది. కుమార్తె బాధను చూడలేక మేఘల తల్లి కళావతి కోర్టును ఆశ్రయించారు. ఇండియన్‌ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ జిఆర్‌ స్వామినాథన్‌, ఈ విషయంలో ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించినట్లు మద్రాస్‌ హైకోర్టుకు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com