మెయిడ్స్ రిటర్న్: ఒమన్తో భారత్ చర్చలు
- June 30, 2016
భారత ప్రభుత్వం, 14 మంది హౌస్ మెయిడ్స్ని ఒమన్ నుంచి భారత్కి రప్పించేందుకు సంప్రదింపులు ప్రారంభించింది. వీరంతా తమిళనాడుకు చెందినవారు. ఆర్థిక ఇబ్బందులతో ఒమన్లో ఇరుక్కుపోయిన ఈ 14 మంది హౌస్మెయిడ్స్ విషయంలో మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. వారిలో ఓ మహిళ తల్లి, న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటిషన్ని దాఖలు చేశారు. న్యాయస్థానం, ఆ మహిళల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నెలకు 114 ఒమన్ రియాల్స్ (సుమారు 20,000 రూపాయలు నెలకు) జీతానికి ఒమన్లో పనిచేస్తోంది మేఘల. రోజుకి 22 గంటల పాటు ఆమె అక్కడ పనిచేయాల్సి వస్తోంది. కుమార్తె బాధను చూడలేక మేఘల తల్లి కళావతి కోర్టును ఆశ్రయించారు. ఇండియన్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ జిఆర్ స్వామినాథన్, ఈ విషయంలో ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించినట్లు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







