మూడు ట్రక్కుల ఢీ: ఒకరి మృతి
- June 30, 2016
ఎమిరేట్స్ రోడ్పై జరిగిన ప్రమాదంలో మూడు ట్రక్కులు ధ్వంసం కాగా, ఒకర్ని ఈ ప్రమాదం బలి తీసుకుంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని ఆసియాకి చెందిన 43 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఒక వాహనం ఇంకో వాహనంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. షార్జా వింటర్ క్యాంప్స్ ప్రాంతంలో ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. మొదటి ట్రక్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు. మరో డ్రైవర్, తీవ్ర గాయాల పాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. రహదార్లపై ప్రయాణించే వాహనాలు నిర్ధారిత వేగంతో వెళితే ప్రమాదాల్ని నివారించవచ్చనీ పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







