ఉమ్ సలాల్లో 17 ఏళ్ల యువకుడిపై సింహం దాడి..!!
- January 30, 2025
దోహా, ఖతార్: ఉమ్ సలాల్లో 17 ఏళ్ల ఖతార్ యువకుడిపై ఓ సింహం దాడి చేసింది. ఈ దాడిలో యువకుడి తలకు, శరీరంలోని వివిధ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి... ఉమ్ సలాల్ ప్రాంతంలో ఈ సంఘటన రెండు వారాల క్రితం జరిగింది. గాయపడిన యువకుడి తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు 2022లో సింహం పిల్లను (4 నెలల వయస్సు) తీసుకొచ్చాడని, అయితే దాని కారణంగా అతడు అలెర్జీలక గురయ్యాడు. దాంతో దానిని జంతు శిక్షణ నిపుణుడి సంరక్షణకు తరలించారు. అనంతరం ఆ యువకుడు సింహాన్ని 3 సార్లు సందర్శించాడు. కాగా, దాడికి దారితీసిన మూడవ సందర్శన జనవరి 12న జరిగింది. ఆ సమయంలో తన కుమారుడిపై సింహం దాడి చేసిందన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యువకుడిని హమద్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన కుమారుడిపై ఆడ సింహం దాడి చేసిందన్న పుకార్లను కొట్టిపారేసిన తల్లి, శిక్షకుడు పెంచిన సింహమే తన కుమారుడిపై దాడి చేసి గాయపరిచిందని, ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







