ఉమ్ సలాల్లో 17 ఏళ్ల యువకుడిపై సింహం దాడి..!!
- January 30, 2025
దోహా, ఖతార్: ఉమ్ సలాల్లో 17 ఏళ్ల ఖతార్ యువకుడిపై ఓ సింహం దాడి చేసింది. ఈ దాడిలో యువకుడి తలకు, శరీరంలోని వివిధ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి... ఉమ్ సలాల్ ప్రాంతంలో ఈ సంఘటన రెండు వారాల క్రితం జరిగింది. గాయపడిన యువకుడి తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు 2022లో సింహం పిల్లను (4 నెలల వయస్సు) తీసుకొచ్చాడని, అయితే దాని కారణంగా అతడు అలెర్జీలక గురయ్యాడు. దాంతో దానిని జంతు శిక్షణ నిపుణుడి సంరక్షణకు తరలించారు. అనంతరం ఆ యువకుడు సింహాన్ని 3 సార్లు సందర్శించాడు. కాగా, దాడికి దారితీసిన మూడవ సందర్శన జనవరి 12న జరిగింది. ఆ సమయంలో తన కుమారుడిపై సింహం దాడి చేసిందన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యువకుడిని హమద్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన కుమారుడిపై ఆడ సింహం దాడి చేసిందన్న పుకార్లను కొట్టిపారేసిన తల్లి, శిక్షకుడు పెంచిన సింహమే తన కుమారుడిపై దాడి చేసి గాయపరిచిందని, ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







