ఫుజైరాలో 29 ఆహార సంస్థలు మూసివేత..!!
- January 31, 2025
యూఏఈ: 2024లో ప్రజారోగ్యం, భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైన 29 ఆహార సంస్థలను ఫుజైరా మున్సిపాలిటీ మూసివేసింది.ఈ సంస్థలు ప్రజారోగ్యానికి హాని కలిగించే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఫుజైరా మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అల్ అఫ్ఖమ్ తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు. అన్ని ఆహార ఉత్పత్తులు అత్యధిక ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలంటూ సూచించారు.మున్సిపాలిటీ ఆరోగ్య నియంత్రణ విభాగం గతేడాది 31,462 తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల ఫలితంగా 1,525 అధికారిక హెచ్చరికలు జారీ చేశారు. బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ జోన్లతో సహా కీలకమైన ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్లు అల్ అఫ్ఖమ్ తెలిపారు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









