ఫుజైరాలో 29 ఆహార సంస్థలు మూసివేత..!!
- January 31, 2025
యూఏఈ: 2024లో ప్రజారోగ్యం, భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైన 29 ఆహార సంస్థలను ఫుజైరా మున్సిపాలిటీ మూసివేసింది.ఈ సంస్థలు ప్రజారోగ్యానికి హాని కలిగించే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఫుజైరా మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అల్ అఫ్ఖమ్ తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు. అన్ని ఆహార ఉత్పత్తులు అత్యధిక ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలంటూ సూచించారు.మున్సిపాలిటీ ఆరోగ్య నియంత్రణ విభాగం గతేడాది 31,462 తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల ఫలితంగా 1,525 అధికారిక హెచ్చరికలు జారీ చేశారు. బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ జోన్లతో సహా కీలకమైన ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్లు అల్ అఫ్ఖమ్ తెలిపారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







