ఫుజైరాలో 29 ఆహార సంస్థలు మూసివేత..!!
- January 31, 2025
యూఏఈ: 2024లో ప్రజారోగ్యం, భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైన 29 ఆహార సంస్థలను ఫుజైరా మున్సిపాలిటీ మూసివేసింది.ఈ సంస్థలు ప్రజారోగ్యానికి హాని కలిగించే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఫుజైరా మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అల్ అఫ్ఖమ్ తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు. అన్ని ఆహార ఉత్పత్తులు అత్యధిక ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలంటూ సూచించారు.మున్సిపాలిటీ ఆరోగ్య నియంత్రణ విభాగం గతేడాది 31,462 తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల ఫలితంగా 1,525 అధికారిక హెచ్చరికలు జారీ చేశారు. బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ జోన్లతో సహా కీలకమైన ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్లు అల్ అఫ్ఖమ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









