వాషింగ్టన్ దుర్ఘటన పై సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- January 31, 2025
రియాద్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో బుధవారం ప్రయాణీకుల విమానం మిలటరీ హెలికాప్టర్ను ఢీకొన్న దుర్ఘటనపై రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు.ఈ మేరకు వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖను పంపినట్లు అధికారులు తలిపారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బుధవారం సాయంత్రం వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో అమెరికన్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం,యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాలిలో ఢీకొన్నాయి. 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కూడిన విమానం కాన్సాస్ నుండి బయలుదేరింది. శిక్షణ విమానంలో ఉన్న హెలికాప్టర్లో ముగ్గురు సైనిక సిబ్బంది ఉన్నారు. ప్యాసింజర్ విమానం పొటోమాక్ నదిలో కూలిపోయింది.ప్రమాదంలో ప్రాణాలతో బయటపడే అవకాశం లేనందున ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









