వాషింగ్టన్ దుర్ఘటన పై సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- January 31, 2025
రియాద్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో బుధవారం ప్రయాణీకుల విమానం మిలటరీ హెలికాప్టర్ను ఢీకొన్న దుర్ఘటనపై రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు.ఈ మేరకు వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖను పంపినట్లు అధికారులు తలిపారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బుధవారం సాయంత్రం వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో అమెరికన్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం,యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాలిలో ఢీకొన్నాయి. 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కూడిన విమానం కాన్సాస్ నుండి బయలుదేరింది. శిక్షణ విమానంలో ఉన్న హెలికాప్టర్లో ముగ్గురు సైనిక సిబ్బంది ఉన్నారు. ప్యాసింజర్ విమానం పొటోమాక్ నదిలో కూలిపోయింది.ప్రమాదంలో ప్రాణాలతో బయటపడే అవకాశం లేనందున ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







