శింబు ఓ థ్రిల్లింగ్ మూవీతో..
- July 01, 2016
వినోద ప్రపంచంలో వివాదాలూ మామూలే. సినీరంగంలో ఒక్కోసారి పెద్ద హీరోలను కూడా కొన్ని కాంట్రవర్సీస్ చుట్టుముడతాయి. బాగా సాగుతున్న కెరీర్ లో వాటివల్ల టైం వేస్ట్ కావడంతో పాటు ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. అయితే...అవన్నీ సర్దుకొని... మళ్లీ కెరీర్ నే కొనసాగించేవారూ ఉన్నారు. నిన్న మొన్నటివరకు బ్యాడ్ బాయ్ అనిపించుకున్న తమిళ హీరో శింబు ఇప్పుడు ఓ థ్రిల్లింగ్ మూవీతో ముందుకొస్తున్నాడు.ఇదు నమ్ ఆళు రిలీజ్ లేటైన టైంలో శింబు, గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ...అచ్చం ఎన్బదు మదమైఎద మూవీని కంప్లీట్ చేశాడు. ఇది రిలీజ్ కు రెడీగా ఉంది. తెలుగులో ఈ సినిమా... సాహసమే శ్వాసగా సాగిపో పేరుతో వస్తోంది. నాగచైతన్య హీరో. ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు మరో మంచి ఛాన్స్ కొట్టేశాడు. ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో 'ఎఎఎ' అనే సినిమా చేస్తున్నాడు. ఇది వెరైటీ స్టోరీతో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్. ఈ సినిమా పూర్తి పేరు 'అన్బానవన్..అసరాదవన్...అడంగాదవన్'. అంటే ...ప్రేమించేవాడు, భయపడనివాడు, లొంగనివాడు అని అర్ధం. ఈమధ్య రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా థ్రిల్లింగ్ గా మూడు ముఖాలతో ఉంది. మరో విశేషమేమంటే... ఈ సినిమాలో కేరక్టర్ చేసేందుకు శింబు బాగా బరువు పెరుగుతున్నాడట. ఈ మూవీలో అతను ఒక జైంట్ మాన్ లా కనబడాల్సి ఉంది. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ పిక్చర్ శింబుకు టర్నింగ్ పాయింట్ కావచ్చని కూడా అంటున్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







