చైనాకు చైనాయే సాటి..
- July 01, 2016
చైనా సాంకేతికంగానే కాదు.. పర్యాటక రంగంలోనూ ముందుంటుంది. వింతైన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ... భిన్నమైన ప్రదేశాలను సృష్టించడంలోనూ చైనాకు చైనాయే సాటి. దేశం దాటకుండానే ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన కట్టడాలను సందర్శించేలా మారు కట్టడాలను రూపొందించడంలో దిట్ట. అలా ఇప్పటి వరకు ప్రముఖ నిర్మాణాలకు నమూనా కట్టడాలనే నిర్మించిన చైనా.. ఇటీవల రెండు దేశాల ప్రధాన భవనాలను కలిపి ఓ అద్భుతమైన హైబ్రిడ్ భవనాన్ని నిర్మించింది.ఈఫిల్ టవర్.. పీసా టవర్.. ఈజిప్టు పిరమిడ్.. తాజ్మహల్.. లండన్ బ్రిడ్జి ఇలా ప్రపంచంలో చెప్పుకోదగ్గ కట్టడాలను పోలిన కట్టడాలను నిర్మించి చైనా సందర్శకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో ముందడుగు వేసింది. షిజియాజుయంగ్ నగరంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం 'వైట్హౌస్'ను.. చైనీయులు పూజించే బీజింగ్లోని 'టెంపుల్ ఆఫ్ హెవెన్' ఆలయాన్ని కలిపి హైబ్రిడ్ భవనాన్ని గ్రేట్ వాల్ ఇంటర్నేషనల్ మూవీస్ స్టూడియో సంస్థ నిర్మించింది.ఒకవైపు 'వైట్హౌస్'.. మరోవైపు 'టెంపుల్ ఆఫ్ హెవెన్'ను పోలిన రూపుతో ఈ భవనం అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పర్యాటకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో ఈ భవనాన్ని సినిమా చిత్రీకరణలకు వినియోగించుకునేలా నిర్మించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు







