తక్షణమే స్పందించి ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీపీ సుధీర్ బాబు
- February 04, 2025
హైదరాబాద్: ఈరోజు చర్లపల్లి పారిశ్రామికవాడలో సర్వోదయ salvent రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తక్షణమే స్పందించి అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. ప్రమాద స్థలంలో స్వయంగా సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు.అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ దుర్ఘటనలో ఎక్కువ నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా పరిశ్రమలలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు ఇతర సాంకేతిక పరమైన ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.అనంతరం అధికారులకు స్థానికులకు తగిన సూచనలు జాగ్రత్తలు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!









