ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త

- February 08, 2025 , by Maagulf
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త

తిరుమల: ప్రవాస భారతీయ(NRI) భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే ప్రవాస భారతీయులకు భారీ వెసులుబాటు కల్పించింది. ఇకపై రోజుకు 100 మంది వీఐపీ దర్శనాలకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు రోజుకు 50 మంది ఎన్నారైలకు మాత్రమే వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం ఉండేది.

ఎన్నారై భక్తుల వినతుల మేరకు ఆ సంఖ్యను 100 మందికి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నారైలు తమ కుటుంబసభ్యులతో కలిసి సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. టీటీడీ నిర్ణయంతో ఎన్నారై భక్తులు ఆనందం వక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీకీ ధన్యవాదాలు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com